Shreyas Iyer : ఎర్రగా వాచిన తొడ.. ధావన్‌ను ఉద్దేశించి అయ్యర్ షేర్ చేసిన పిక్ వైరల్

ఢిల్లీ కేపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ను తనదైన శైలిలో ట్రోల్‌ చేశాడు యంగ్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. ధావన్ ను ఉద్దేశించి అయ్యర్ షేర్ చేసిన ఎర్రగా వాచిన తొడ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవ్వులు పూయిస్తోంది. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా గురువారం(ఏప్రిల్

Shreyas Iyer : ఎర్రగా వాచిన తొడ.. ధావన్‌ను ఉద్దేశించి అయ్యర్ షేర్ చేసిన పిక్ వైరల్

Shreyas Iyer

Shreyas Iyer : ఢిల్లీ కేపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ను తనదైన శైలిలో ట్రోల్‌ చేశాడు యంగ్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. ధావన్ ను ఉద్దేశించి అయ్యర్ షేర్ చేసిన ఎర్రగా వాచిన తొడ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవ్వులు పూయిస్తోంది. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా గురువారం(ఏప్రిల్ 15,2021) రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శిఖర్‌ ధావన్‌ బ్యాటింగ్‌లో విఫలమైనా మంచి ఎంటర్‌టైన్‌ మెంట్ అందించాడు. రాజస్తాన్‌ జట్టుకు చెందిన ముగ్గురు బ్యాట్స్‌మన్‌ క్యాచ్‌లు ధావన్‌ తీసుకున్నాడు. క్యాచ్‌ తీసుకున్న ప్రతీసారి తొడగొట్టి మీసం మెలేస్తూ ఆకట్టుకున్నాడు. ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చిన వారిలో సంజూ శాంసన్‌, రియాన్‌ పరాగ్‌, శివమ్‌ దూబేలు ఉన్నారు.

ధావన్‌ చర్యలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. దీంతో అయ్యర్‌ ధావన్‌ను ఉద్దేశించి ఎర్రగా వాచిన తొడ ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ధావన్‌ భయ్యా.. క్యాచ్‌లు పట్టినప్పుడల్లా.. తొడ గొట్టావు.. బహుశా మ్యాచ్‌ తర్వాత నీ పరిస్థితి ఇలా ఉంటుందేమో అంటూ చమత్కారంగా క్యాప్షన్‌ జత చేశాడు. అయ్యర్‌ షేర్‌ చేసిన ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

dhawan

రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. ఉనద్కత్ ధాటికి టాప్‌ ఆర్డర్‌ విఫలం కాగా.. కెప్టెన్‌ పంత్‌ హాఫ్‌ సెంచరీతో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులే చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఆరంభంలో.. ఢిల్లీ బౌలర్ల దాటికి రెగులర్ ఇంటర్ వెల్స్ లో వికెట్లు కోల్పోయింది. అయితే మిడిలార్డర్‌లో మిల్లర్‌(63)తో పాటు ఆఖర్లో క్రిస్‌ మోరిస్‌( 36, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో మూడు వికెట్ల తేడాతో అనూహ్యంగా విజయాన్ని అందుకుంది.

ఇక ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో శ్రేయాస్‌ అయ్యర్‌ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో ఇంగ్లండ్‌ సిరీస్‌తో పాటు ఐపీఎల్‌ 14వ సీజన్‌కు అయ్యర్ దూరమయ్యాడు. దీంతో ఢిల్లీ కేపిటల్స్‌ మేనేజ్‌మెంట్‌ అయ్యర్‌ స్థానంలో రిషబ్‌ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది.