Updated On - 6:08 pm, Tue, 23 February 21
karnataka man killed the leopard : తెలుగు,తమిళ సినిమాల్లో హీరోయిన్లను రక్షించటానికి హీరోలు వీరోచితంగా సింహాలు పులులతో పోరాడి వాటిని హతమార్చిన సీన్లు ఎన్నో చూశాం. కానీ నిజ జీవితంలో భార్యా పిల్లలనుకాపాడుకోటానికి ఓకన్నడిగుడు చిరుతతో పోరాడి దాన్ని హతమార్చిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
హసన్ జిల్లా హరిసెక్రె తాలూకా, బెండెకెరే ప్రాంతంలో భార్య కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతున్నరాజగోపాల్ నాయక్ కుటుంబంపై పులి దాడి చేసింది. దీంతో వీళ్లు ముగ్గురు ఒక్కసారిగా కింద పడిపోయారు. పులి భార్యా కూతురు మీదకు లంఘించే సరికి రాజగోపాల్ నాయక్ పులితో పోరాటం సాగించాడు.
వీరోచితంగా పోరాడి పులిని చంపేసి భార్యా కూతురును కాపాడుకున్నాడు. ఈక్రమంలో రాజగోపాల్ నాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జరుగుతున్నసమయానికి అక్కడకు చేరుకున్న స్ధానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
14నెలల్లో 1700మంది బిడ్డల జననం.. ప్రసవాలకు కేరాఫ్ గా 108 అంబులెన్సులు
కర్ణాటక మంత్రి రాసలీలలు.. యాక్షన్ తీసుకుంటామంటోన్న బీజేపీ
మహిళా డాక్టర్ బట్టలు మార్చుకుంటుంటే వీడియో తీసిన మేల్ నర్స్
హోంవర్క్ తప్పించుకునేందుకు అత్యాచారం కథ అల్లిన టెన్త్ విద్యార్థిని
ట్రాఫిక్ పోలీసులు రూ. 500 ఫైన్, మంగళసూత్రం ఇచ్చిన మహిళ..ఎందుకు ?
హోదాను సైతం పక్కనపెట్టి, కారు టైర్ బిగించిన కలెక్టర్