తమ్ముడితో అక్రమ సంబంధం, అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించింది

కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మొదట్లో క్రైమ్ రేట్ తగ్గింది. అందులో మర్డర్స్ తక్కువ

  • Published By: naveen ,Published On : May 11, 2020 / 07:31 AM IST
తమ్ముడితో అక్రమ సంబంధం, అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించింది

కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మొదట్లో క్రైమ్ రేట్ తగ్గింది. అందులో మర్డర్స్ తక్కువ

కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మొదట్లో క్రైమ్ రేట్ తగ్గింది. అందులో మర్డర్స్ తక్కువ జరిగాయి. దీంతో పోలీసులు కొంత రిలీఫ్ పొందారు. కానీ రోజులు గడిచే కొద్దీ మళ్లీ క్రైమ్ రేట్ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా అక్రమ సంబంధాలకు సంబంధించిన మర్డర్లు పెరిగాయి. ఇల్లీగల్ అఫైర్లు పెట్టుకున్న భర్త.. భార్యని, భార్య.. భర్తని చంపుతున్నారు. తమ సుఖం కోసం క్రిమినల్స్ గా మారుతున్నారు.

తమ్ముడితో అక్రమ సంబంధం:
తాజాగా తమ్ముడి వరుసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ దానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ కట్టుకున్న భర్తనే చంపించింది. ఈ దారుణం అనంతపురం జిల్లాలో జరిగింది. జిల్లాలోని ధర్మవరం శివార్లలోని మేడాపురం రైల్వే వంతెన దగ్గర మే 4న జరిగిన ఒక హత్య కేసులో నలుగురు నిందితులను తాజాగా ధర్మవరం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారించగా వారి నుండి ఈ హత్యకు సంబంధించి షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

అడ్డుగా ఉన్నాడని భర్త హత్యకి స్కెచ్:
ధర్మవరం పట్టణంలో నాగేంద్ర, నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు. నాగమణికి మేడాపురం గ్రామానికి చెందిన వరుసకు తమ్ముడయ్యే మట్టా కేశవతో అక్రమ సంబంధం ఉంది. తమ్ముడు కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. దీంతో కేశవ తరుచూ నాగమణి ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగించేవాడు. ఓ రోజు వీరి విషయం భర్త నాగేంద్రకు తెలియడంతో పెద్దల దగ్గర పంచాయతీ పెట్టాడు. పెద్దలు ఆమెను మందలించి ఇకనైనా బుద్దిగా బతకమన్నారు. కానీ తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా చంపేయాలని నాగమణి కుట్ర పన్నింది. ఇందుకు భర్త స్నేహితుడు బాబుతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1.20 లక్షల నగదు, రెండు సెంట్ల భూమి సుపారీగా ఇచ్చేందుకు ఒప్పుకుని భర్తను చంపించింది. ధర్మవరం పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఈ వ్యవహారం బయటపడింది. నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ధర్మవరం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించడంతో పోలీసులు వారిని జైలుకి తరలించారు.

మద్యం తాగించి మర్డర్:
మే 4న మద్యం తాగుదామంటూ నాగేంద్రను అతడి స్నేహితుడు బాబు ధర్మవరం శివార్లలోని మేడాపురం రైల్వే వంతెన దగ్గరికి తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. అక్కడ బాబుకి బ్రహ్మయ్య తోడయ్యాడు. నాగేంద్రకు ఫుల్లుగా మద్యం తాగించడంతో అతడు మత్తులోకి జారుకున్నాడని ఆ తర్వాత బ్రహ్మయ్య, బాబు బండరాయితో తలపై మోది నాగేంద్రను చంపేశారని పోలీసులు వెల్లడించారు. 

Read More:

మొదటి భార్యకు విడాకులిచ్చాడు, రెండో భార్య ఆత్మహత్య, మూడో భార్యను హత్య చేశాడు

* లాక్ డౌన్ లోనూ లాడ్జిలో భర్త రాసలీలలు, రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన భార్య