Madhya Pradesh: ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది మృతి.. 15 మందికి గాయాలు
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మందితో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ నర్మద నదిలో పడిపోయింది. దీంతో 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి గాయాలయ్యాయి. పలువురు గల్లంతయ్యారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మందితో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ నర్మద నదిలో పడిపోయింది. దీంతో 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి గాయాలయ్యాయి. పలువురు గల్లంతయ్యారు. ధార్ జిల్లా ఖాల్ఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బస్సు ఇండోర్ నుంచి మహారాష్ట్రలోని పుణె వెళ్తుండగా వంతెనపై అదుపు తప్పి నర్మదా నదిలో పడిపోయిందని అధికారులు చెప్పారు.
పోలీసులు, రెస్క్యూ బృందాల సభ్యులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టామని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాలని ఆయన అధికారులకు సూచించారు.