Himachal Pradesh: ఘోర బస్సు ప్రమాదం.. స్కూల్ విద్యార్థులు సహా 16 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ ఉదయం 8.30 గంటలకు ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. కుల్లూ జిల్లాలోని నియోలీ-షంషెడ్ రోడ్డు మీదుగా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అక్కడి జంగ్లా ప్రాంతంలోని సయింజ్ లోయలో అదుపుతప్పి పడిపోయింది.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ ఉదయం 8.30 గంటలకు ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. కుల్లూ జిల్లాలోని నియోలీ-షంషెడ్ రోడ్డు మీదుగా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అక్కడి జంగ్లా ప్రాంతంలోని సయింజ్ లోయలో అదుపుతప్పి పడిపోయింది. దీంతో పాఠశాల విద్యార్థులు సహా 16 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొంతమందికి గాయాలయ్యాయి.
వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదస్థలి వద్ద పోలీసులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాదానికి గురైన బస్సు నుజ్జునుజ్జయింది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో దాదాపు 40 మంది ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.