Peru Accident: పెరూలో ఘోర బ‌స్సు ప్ర‌మాదం.. 24 మంది మృతి

పెరూలో ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటుచేసుకుంది. 60 మందితో కొంత ప్రాంతం మీదుగా వెళ్తున్న ఓ ప్రైవేటు బ‌స్సు అదుపుతప్పి లోయ‌లో ప‌డిపోయింది. దీంతో 24 మంది ప్రాణాలు కోల్పోగా, మిగ‌తా ప్ర‌యాణికులకు గాయాల‌య్యాయి. ఆ బ‌స్సు కొరియాంకా టూర్స్ కంపెనీకి చెందిన‌ద‌ని వివ‌రించారు.

Peru Accident: పెరూలో ఘోర బ‌స్సు ప్ర‌మాదం.. 24 మంది మృతి

road accident

Peru Accident: పెరూలో ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటుచేసుకుంది. 60 మందితో కొంత ప్రాంతం మీదుగా వెళ్తున్న ఓ ప్రైవేటు బ‌స్సు అదుపుతప్పి లోయ‌లో ప‌డిపోయింది. దీంతో 24 మంది ప్రాణాలు కోల్పోగా, మిగ‌తా ప్ర‌యాణికులకు గాయాల‌య్యాయి. ఆ బ‌స్సు కొరియాంకా టూర్స్ కంపెనీకి చెందిన‌ద‌ని వివ‌రించారు.

అది లిమా నుంచి టంబెస్ కు వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంద‌ని చెప్పారు. ప్ర‌మాదం చోటుచేసుకున్న ప్రాంతం వ‌ద్ద స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగించ‌డం క్లిష్ట‌త‌ర‌మైన ప‌ని అని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ స‌హాయ‌క బృందాలు శ్ర‌మించి ఆ ప్రాంతానికి వెళ్లి రెస్క్యూ ఆప‌రేష‌న్ చేశాయి. బ‌స్సు ప్ర‌మాదంపై అధికారులు విచార‌ణ జరుపుతున్నారు.

బ‌స్సులో ఇరుక్కుపోయిన ప్ర‌యాణికుల‌ను బ‌య‌ట‌కు తీసిన స‌హాయ‌క బృందాలు వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించాయి. ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. ప్ర‌మాదానికి గురైన ప్ర‌యాణికులు ప‌ర్యాట‌కులుగా తెలుస్తోంది. వారిలో చాలా మంది హైతీకి చెందిన వారని అధికారులు గుర్తించారు. హైతీ నుంచి పెరూకి వ‌చ్చే వ‌ల‌స‌దారుల సంఖ్య కూడా ఈ మధ్య పెరుగుతోంది.

IND vs NZ 2nd T20: హార్ధిక్ సేనకు పరీక్ష.. నేడు ఇండియా వర్సెస్ కివీస్ రెండో టీ20 మ్యాచ్.. తుది జట్టులో రెండు మార్పులు?