Maharashtra: ఆరుగురు పిల్ల‌ల‌ను బావిలో తోసి చంపిన త‌ల్లి

పిల్ల‌ల‌కు త‌ల్లిని మించిన ర‌క్ష‌ణ‌, ప్రేమ ఎక్క‌డా దొర‌క‌ద‌ని అంటారు. త‌న ప్రాణాల‌ను బ‌లి ఇచ్చి అయినా స‌రే త‌న పిల్ల‌ల‌ను కాపాడుకోవాల‌నుకుంటుంది త‌ల్లి. అయితే, అమ్మ‌త‌నానికే మ‌చ్చ తెచ్చేలా వ్య‌వ‌హ‌రించింది ఓ మ‌హిళ‌.

Maharashtra: ఆరుగురు పిల్ల‌ల‌ను బావిలో తోసి చంపిన త‌ల్లి

Mtoehr

Maharashtra: పిల్ల‌ల‌కు త‌ల్లిని మించిన ర‌క్ష‌ణ‌, ప్రేమ ఎక్క‌డా దొర‌క‌ద‌ని అంటారు. త‌న ప్రాణాల‌ను బ‌లి ఇచ్చి అయినా స‌రే త‌న పిల్ల‌ల‌ను కాపాడుకోవాల‌నుకుంటుంది త‌ల్లి. అయితే, అమ్మ‌త‌నానికే మ‌చ్చ తెచ్చేలా వ్య‌వ‌హ‌రించింది ఓ మ‌హిళ‌. త‌న ఆరుగురు పిల్ల‌ల‌ను బావిలో తోసేసి చంపేసింది. ఈ దారుణ‌ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని రాయ్‌గ‌ఢ్ జిల్లాలో ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Gujarat elections 2022: జూన్ 2న బీజేపీలో చేర‌నున్న హార్దిక్ ప‌టేల్

కుటుంబ త‌గాదాల వ‌ల్లే ఆ త‌ల్లి ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. మ‌హ‌ద్ తాలూకా ఖ‌రావ‌ళి గ్రామానికి చెందిన ఓ మ‌హిళ (30) కుటుంబ స‌భ్యుల‌తో గొడ‌వ ప‌డిందని వివ‌రించారు. ఆమెను అత్తింటివారు కొట్ట‌డంతో ఆ కోపంతో త‌న కుమారుడు, ఐదుగురు కుమార్తెల‌ను తీసుకుని బావి వ‌ద్ద‌కు వెళ్లింద‌ని చెప్పారు. ఆరుగురు పిల్ల‌ల‌ను బావిలోకి తోసేసింద‌ని వివరించారు. ఆ పిల్ల‌ల వ‌య‌సు 18 నెల‌ల నుంచి 10 ఏళ్ల మ‌ధ్య ఉంటుంద‌ని స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు. ఆ పిల్లలు అందరూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. పిల్ల‌ల‌ను బావిలోకి తోసేసిన త‌ర్వాత ఆ త‌ల్లి కూడా బావిలోకి దూకి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింద‌ని, అయితే, స్థానికులు ఆమెను కాపాడార‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.