ఇంటికొచ్చిన భార్య చెల్లెలికి స్వీట్‌లో మత్తు కలిపి భర్త అత్యాచారం

  • Published By: srihari ,Published On : May 2, 2020 / 10:40 AM IST
ఇంటికొచ్చిన భార్య చెల్లెలికి స్వీట్‌లో మత్తు కలిపి భర్త అత్యాచారం

ఆడపిల్లకు ఇంటి బయటే కాదు ఇంట్లోనూ రక్షణ కరువైంది. అయిన వాళ్లే కామంతో కళ్లు మూసుకుపోయి కాటేస్తున్నారు. లైంగిక దాడులకు తెగబడుతున్నారు. నమ్మించి మోసం చేసి తమ కామవాంఛలు తీర్చుకుంటున్నారు. మరదలిపై కన్నేసిన ఓ బావ, ఆమెని అనుభవించేందుకు దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్వీట్ లో మత్తు మందు కలిపి మరదలిపై అఘాయిత్యం చేశాడు.

మరదలిపై కన్నేసిన బావ:
జార్ఖండ్ లో దారుణం జరిగింది. హజారీఘర్‌ జిల్లాకి చెందిన ఓ గ్రామంలో రామ్ లాల్ అనే వ్యక్తి స్థానిక ప్రాంతంలో భార్య పిల్లలతో కలసి నివాసముంటున్నాడు. రాంలాల్ మరదలు సోనీ తన సోదరి ఇంట్లో చదువుకునేందుకు వచ్చింది. ఈ క్రమంలో రాంలాల్ తన మరదలిపై కన్నేశాడు. ఆమెను దక్కించుకోవాలని పలు ప్రయత్నాలు చేశాడు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇదే అదునుగా భావించిన రాంలాల్ యువతికి మత్తు పదార్థాలు కలిపిన స్వీట్లు పెట్టాడు. వాటిని తిన్న ఆ యువతి మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత యువతిని రాంలాల్ అత్యాచారం చేశాడు. తన కామవాంఛలు తీర్చుకున్నాడు.

పోలీసుల అదుపులో నిందితుడు:
కాసేపటికి మెలకువలోకి వచ్చిన బాధితురాలు తనపై అత్యాచారం జరిగినట్లు తెలుసుకుని షాక్ కి గురైంది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. రాంలాల్ పై ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రాంలాల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రాంలాల్ ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు, స్థానికులు డిమాండ్ చేశారు.(లాక్ డౌన్ తో బయటపడ్డ  ప్రియుడి బాగోతం)