అత్త రాస లీలలు….వద్దన్న అల్లుడు…ప్రియుడితో కలసి హత్య చేసిన అత్త

  • Published By: murthy ,Published On : May 2, 2020 / 10:51 AM IST
అత్త రాస లీలలు….వద్దన్న అల్లుడు…ప్రియుడితో కలసి హత్య చేసిన అత్త

అత్త గారి అక్రమ సంబంధం అల్లుడి చావుకొచ్చింది. తన సహోద్యోగితో, అత్త పెట్టుకున్న అక్రమ సంబంధం వద్దని చాలా సార్లు చెప్పి చూశాడు. అయినా ప్రవర్తన మార్చుకోని  అత్త..కూతురు, ప్రియుడితో, కలిసి అల్లుడిని తుదముట్టించింది.
 

జమ్మూ కు చెందిన సూర్జిత్  రైల్వే లో కార్పెంటర్ ఉద్యోగం చేస్తూ ఘజియాబాద్ లో భార్య రషిక, నాలుగేళ్ల కొడుకుతో కలిసి జీవిస్తున్నాడు. అతని భార్య రషిక తల్లి రమాదేవి రైల్వేలో టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న దేవేంద్ర అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ తరచూ కలుసుకోవటం…రాసలీలలు సాగించటం తెలుసుకున్న సూర్జిత్ ఆమె ప్రవర్తన మార్చుకోమని భార్య రషిక ద్వారా చెప్పించాడు.  
 

ఎన్ని సార్లు చెప్పినప్పటికీ అత్త రమాదేవి ప్రవర్తన మార్చుకోకపోగా అల్లుడు మాటలు పెడచెవిన పెట్టి దేవేంద్రతో సంబంధం కొనసాగించసాగింది. అత్త అక్రమ సంబంధానికి భార్య సపోర్టు కూడా ఉండటంతో  …ఈవిషయమై భార్య భర్తల మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఇటీవల సూర్జిత్ మరోసారి భార్యతో గొడవపడ్డాడు. అల్లుడి అభ్యంతరాలు భరించలేని ముగ్గురు కలిసి సూర్జిత్ ను అంతమొందించాలని ప్లాన్ వేశారు. 
 

ఏప్రిల్ 27 సోమవారం రాత్రి భోజనం చేశాక అత్త రమాదేవి ఫోన్ చేసి అల్లుడిని తన ఇంటికి  రమ్మని పిలిచింది. భార్య రషికతో కలిసి రమాదేవి ఇంటికి వెళ్ళాడు సూర్జిత్. అప్పటికే అక్కడ దేవేంద్ర కూడా ఉన్నాడు. వారితో మాట్లాడుతుండగా భార్య రషిక కత్తితో వెనుక నుంచి భర్తను పొడిచింది. కత్తి పోటుకుకిందపడిన భర్త తలపై బలంగా కొట్టింది. 
 

అనంతరం అత్త, ఆమె ప్రియుడు కలిసి సూర్జిత్ గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. శవాన్ని సూర్జిత్ సమీపంలో ఖాళీగా ఉన్న క్వార్టర్స్ లో పడేసి వచ్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం  ఆస్పత్రికి తరలించారు. కేసు విచారించి నిందితులు ముగ్గురిని ఏప్రిల్ 28 నాడు అరెస్టు చేసినట్లు డీఎస్పీ ధర్మేంద్ర చౌహాన్ చెప్పారు. 

Also Read | ఇంటికొచ్చిన భార్య చెల్లెలికి స్వీట్‌లో మత్తు కలిపి భర్త అత్యాచారం