8 Fetuses in Stomach : 21 రోజుల ఆడశిశువు కడుపులో 8 పిండాలు..! ఝార్ఖండ్‌‌లో ప్రపంచంలోనే అరుదైన ఘటన..!

21 రోజుల ఆడశిశువు కడుపులో 8 పిండాలు ఉన్నాయి. మొదటి వాటిని కణితులుగా భావించిన ఢాక్టర్లు అవి కణితులు కావు పిండాలు అని గుర్తించి ఆశ్చర్యపోయారు. ఝార్ఖండ్‌‌లో జరిగిన ఈ ఘటన ప్రపంచంలోనే అరుదైనది అంటున్నారు డాక్టర్లు.

8 Fetuses in Stomach : 21 రోజుల ఆడశిశువు కడుపులో 8 పిండాలు..! ఝార్ఖండ్‌‌లో ప్రపంచంలోనే అరుదైన ఘటన..!

8 fetuses in Stomach of 21 days girl baby

8 fetuses in Stomach of 21 days girl baby : అమ్మ కడుపులోంచి ఈ లోకంలోకి వచ్చి నెల రోజులు కూడా అవ్వని ఓ నవజాత శిశువు వార్తల్లో నిలిచింది. ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇది వింత అనేంత అత్యంత అరుదైన ఘటనకు కేంద్రంగా నిలిచిందా శిశుశు. పుట్టి నెల రోజులు కూడా కాని ఆ శిశువు కడుపులో 8 పిండాలు ఉన్నట్లుగా గుర్తించారు డాక్టర్లు. బిడ్డ పదే పదే ఏడుస్తుండటంతో తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు ఏంటాని డాక్టర్లకు చూపించగా ఆ శిశువును పరీక్షలు చేసిన డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఆ శిశువు కడుపులో ఏకంగా ఎనిమిది పిండాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచిలో జరిగిన ఈ ఘటన ప్రపంచంలోనే అరుదైనది అంటున్నారు డాక్టర్లు.

రాంచీలోని రామ్‌గఢ్‌లో అక్టోబరు 10న ఓమహిళ ఓ పాప జన్మనిచ్చింది. ప్రసవం తరువాత డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లిన తరువాత బిడ్డ పదే పదే ఏడుస్తుండటంతో తల్లిదండ్రులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. అప్పటికి పాప పుట్టి 21 రోజులు అయ్యింది. పాపను పరీక్షించిన డాక్టర్లు కడుపునొప్పి అని గుర్తించారు. వెంటనే పరీక్షలు చేశారు. సీటీ స్కాన్ నిర్వహించిన డాక్టరు శిశువు కడుపులో కణితులు ఉన్నట్టు గుర్తించారు. ఆ తరువాత హాస్పిటల్ లోనే 21 రోజులు పర్యవేక్షణలో ఉంచారు.

ఈక్రమంలో నవంబర్ 1న కణితులు తొలగించేందుకు సీనియర్ డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లు లోపల కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. అవి కణితులు కావని..సరిగా అభివృద్ధి చెందని పిండాలని గుర్తించారు. అంతే సీనియర్ డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. అలా గంటన్నరపాటు ఆపరేషన్ చేసి ఆ పిండాలను తొలగించారు.

శిశువుల పొట్టలో అభివృద్ధి చెందని పిండాలు వెలుగు చూసిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా వందలోపే ఉన్నట్టు ఈ సందర్భంగా డాక్టర్లు వెల్లడించారు. ఆయా కేసుల్లో ఒక పిండాన్ని మాత్రమే తొలగించారని, కానీ నవజాత శిశువులో ఏకంగా 8 పిండాలు ఉన్నాయని..ఇలాంటి ఘటన ప్రపంచంలో ఇదే మొదటిదని డాక్టర్లు తెలిపారు.