వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8మంది మృతి.. పరారీలో డాక్టర్

వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8మంది మృతి.. పరారీలో డాక్టర్

8 Members Of A Family Dead 5 Hospitalized

వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8మంది మృతి చెందిన ఘటన ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది గురువారం చనిపోగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. హోమియోపతి మందు తాగడం వల్లే మరణాలు సంభవించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇతర కారణాలను తెలుసుకోవడానికి టీమ్ ఏర్పాటైంది.

CMO ప్రకారం, ఈ వ్యక్తులు 91శాతం ఆల్కహాల్ కలిగి ఉన్న హోమియోపతి డ్రొసెరా 30ను తాగారు. ఈ మందును వారికి ఇచ్చిన డాక్టర్ పరారీలో ఉన్నాడు. కరోనా సంక్రమణను నివారించడానికి ఈ వ్యక్తులు ఆల్కహాల్ కలిగిన ఈ ఔషధాన్ని తీసుకున్నారని చెబుతున్నారు.

పారిపోయిన డాక్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ధర్యాప్తు చేపట్టారు పోలీసులు.