Samantha : యశోద ఓటీటీ రిలీజ్ ఆపాలంటూ.. సమంతపై పరువునష్టం దావా..

సమంతపై, యశోద చిత్ర నిర్మాణ సంస్థపై ఓ హాస్పిటల్ యాజమాన్యం పరువు నష్టం దావా కేసు వేసింది. యశోద సినిమాని సరోగసి, హాస్పిటల్ లో జరిగే అక్రమాల కథాంశంతో తెరకెక్కించారు. సినిమాలో.............

Samantha : యశోద ఓటీటీ రిలీజ్ ఆపాలంటూ.. సమంతపై పరువునష్టం దావా..

A case has been registered against Samantha Yashoda's movie

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. లేడి ఓరియెంటెడ్ సినిమాగా యశోద మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో సమంత తన యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టేసింది. యశోద సినిమా ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూలు చేసి హిట్ కొట్టింది. త్వరలో ఓటీటీ రిలీజ్ కి కూడా ప్లాన్ చేస్తున్నారు.

అయితే సమంతపై, యశోద చిత్ర నిర్మాణ సంస్థపై ఓ హాస్పిటల్ యాజమాన్యం పరువు నష్టం దావా కేసు వేసింది. యశోద సినిమాని సరోగసి, హాస్పిటల్ లో జరిగే అక్రమాల కథాంశంతో తెరకెక్కించారు. సినిమాలో హాస్పిటల్ కి ఇవ అనే పేరు పెట్టారు. అయితే బయట నిజంగానే ఇవ పేరుతో హాస్పిటల్ ఉంది.

Allari Naresh : ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను.. కానీ..

దీంతో ఇవ హాస్పిటల్ ఎండి, డాక్టర్స్ కలిసి తమ సినిమాలో తమ హాస్పిటల్ పేరు వాడుకొని, హాస్పిటల్ లో అక్రమాలు జరిగినట్టు చూపించి మా సంస్థ ఇమేజ్ ని దెబ్బ తీశారు అని యశోద నిర్మాణ సంస్థ, సమంత, దర్శకులపై పరువు నష్టం దావా కేసు వేశారు. సినిమాని ఓటీటీలో అయినా రిలీజ్ అవ్వకుండా ఆపాలని కోరారు. కేసుని పరిశీలించిన కోర్టు డిసెంబర్ 19 వరకు యశోద సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయొద్దని తెలిపి, తదుపరి విచారణని డిసెంబర్ 19కి వాయిదా వేశారు. అయితే దీనిపై చిత్రయూనిట్ స్పందించలేదు.