‘దిష్టి పోయింది’.. ఆదిపురుష్ సెట్‌లో అగ్నిప్రమాదం..

‘దిష్టి పోయింది’.. ఆదిపురుష్ సెట్‌లో అగ్నిప్రమాదం..

Adipurush Sets: రెబల్‌ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘ఆదిపురుష్’ మంగళవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. ‘‘ఆది పురుష్’ ఆరంభ్’’ అంటూ టైటిల్ లోగోతో ట్వీట్ చేశారు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న భారీ బడ్జెట్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆదిపురుష్’ లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

https://10tv.in/rebel-star-prabhas-adipurush-aarambh/

ఇదిలా ఉంటే సినిమా ప్రారంభించిన మొదటిరోజునే ‘ఆదిపురుష్’ సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో ‘ఆదిపురుష్’ కోసం భారీ సెట్ వేశారు.

మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. దీంతో మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ఫస్ట్ డే నే ఇలా అయ్యిందేంటి అని నిరుత్సాహ పడుతున్న నెటిజన్లకు ‘దిష్టి పోయింది అనుకుందాం బ్రదర్’ అంటూ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ జవాబిచ్చాడు.

Image

టీ సిరీస్‌ బ్యానర్‌ భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌లతో పాటు ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)