పెయింటింగ్ ధర రూ. 670కోట్లు

పెయింటింగ్ ధర రూ. 670కోట్లు

single buyer:వ‌ంద‌ల ఏళ్ల నాటి ఇటలీకి చెందిన చిత్రకారుడు వేసిన పెయింటింగ్‌ వేలంలో రికార్డు ధ‌ర దక్కించుకుంది. ఆ పెయింటింగ్‌ ఏకంగా రూ.670 కోట్లకు అమ్ముడై ప్రపంచవ్యాప్తంగా వార్తగా మారింది. ఇట‌లీలో క్రీస్తు శకం 1440-1510 మధ్య కాలంలో ప్రఖ్యాత చిత్రకారుడు సాండ్రో బొటిసెల్లి తన జీవితకాలంలో ఎన్నో రకాల పెయింటింగ్‌లు వేయగా.. ఈ పెయింటింగ్‌ కూడా ఆయనే వేశారు.

ఈ పెయింటింగ్‌ని ఇటీవ‌ల న్యూయార్క్‌లో వేలం వేయగా.. కళ్లు చెదిరే ధర పలికింది. వేలంలో పెయింటింగ్ ఏకంగా‌ 92.2 మిలియన్‌ డాలర్లు(భారత కరెన్సీ రూపాయలలో రూ.670 కోట్లు) అమ్ముడుపోయింది. ఈ విష‌యాన్ని వేలం నిర్వాహకులు వెల్లడించారు. కాగా, సాండ్రో బొటిసెల్లి గీసిన ఎన్నో చిత్రాలు గతంలో కూడా వేలానికి రాగా.. ఏ ఒక్క‌టి కూడా ఈ స్థాయిలో ధర పలకలేదని నిర్వాహకులు తెలిపారు.