Aadhaar Link : ఓటర్ కార్డుకు అధార్ అనుసంధానం

ఇదిలా వుంటే ఓటర్ కార్డును అధార్ తో అనుసంధానం చేసిన పక్షంలో డేటా దుర్వినియోగం కాకుండా ఎలక్టోరల్ డేటా ఫ్లాట్ ఫామ్ భద్రత కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుంది.

Aadhaar Link : ఓటర్ కార్డుకు అధార్ అనుసంధానం

Voter Card (1)

Aadhaar Link : 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య అధార్ ప్రస్తుతం భారత దేశంలో వ్యక్తుల యొక్క కార్యకలాపాల్లో ముఖ్య భాగమైపోయింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్ధ యుఐడిఏఐ జారీచేసే ఈ కార్డులో వ్యక్తికి సంబంధించిన వేలిముద్రలతోపాటు, వ్యక్తిగత సమాచారం ఇందులో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. ఇప్పటికే రేషన్ కార్డు మొదలు, ఆర్ధిక కార్యకలపాలు, సంక్షేమం, ఉపాధి ఇతర అన్ని కార్యకలాపాలకు అధార్ ను ప్రామాణికంగా భావిస్తుండగా భవిష్యత్తులో ఓటర్ గుర్తింపు కార్డును అధార్ తో అనుసంధానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.

ప్రస్తుతం ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనిపై లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు సాజ్దా అహ్మద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం వెల్లడించారు. ఇప్పటికే లా కమిషన్ పరిశీలన పూర్తయిందని త్వరలోనే అనుసంధాన ప్రక్రియ పై కసరత్తు ప్రారంభమవుతున్నాట్లు స్పష్టం చేశారు.

ఓటరు కార్డుకు అధార్ లింక్ కారణంగా దొంగ ఓట్ల బెడదను నిరోధించటంతోపాటు, ఒక వ్యక్తి ఒక ప్రాంతంలోనే తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. వేర్వేరు ప్రాంతాల్లో ఓటుహక్కును వినియోగించుకోవటానికి ప్రయత్నిస్తే వెంటనే సాంకేతికత అందుకు ఎట్టిపరిస్ధితుల్లో అనుమతించదు. ఎన్నికల సంఘం సైతం ఓటర్ కార్డును అధార్ తో అనుసంధానించమంటూ గతంలోనే ప్రతిపాదించింది.

ఇదిలా వుంటే ఓటర్ కార్డును అధార్ తో అనుసంధానం చేసిన పక్షంలో డేటా దుర్వినియోగం కాకుండా ఎలక్టోరల్ డేటా ఫ్లాట్ ఫామ్ భద్రత కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుంది. ఎలక్టోరల్ రోల్ డేటాబేస్ సిస్టమ్ అధార్ ఎకో సిస్టమ్ లోకి ప్రవేశించదని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు ఓటరు కార్డును అధార్ తో అనుసంధానించటం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత డేటాను రక్షించేందుకు ప్రత్యేక చట్టం లేకపోటంతోపాటు, డేటా మొత్తం బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉండటం, ఇష్టం వచ్చినట్లు ఓటర్లను తొలగించే పరిస్ధితులు కూడా ఉత్పన్నం అవుతాయన్న ఆందోళన వ్యక్తమౌతుంది. వలస కార్మికులు వారి స్వస్ధలాలలో ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలుగా ఓటుహక్కు సద్వినియోగం చేసుకునేందుకు అనుమతించాల్సి ఉంటుంది.