Gyanvapi Masjid : జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింల తరపు న్యాయవాది హార్ట్ఎటాక్ తో మృతి
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన వారాణసి జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింల తరపు న్యాయవాది అభయ్నాథ్ యాదవ్ గుండెపోటుతో మరణించారు.
Gyanvapi Masjid: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన వారాణసీ నగరంలోని జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింల తరపు న్యాయవాది అభయ్నాథ్ యాదవ్ గుండెపోటుతో మరణించారు. ఆదివారం (7,2022) రాత్రి గుండెపోటుకు గురి అయిన ఆయనను వెంటనే హాస్పిటలర్ కు తరలించారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆయన మరణించారని నిర్ధారించారు. సీనియర్ న్యాయవాది అయిన అభయ్ నాత్ యాదవ్ జ్ఞానవాపి మసీదు, శృంగార్ గౌరి కేసు కేసుల్లో ముస్లింల తరపున వాదిస్తున్నారు. హార్ట్ ఎటాక్తో కుప్పకూలిన ఆయనను వెంటనే వారణాసిలోని మక్బూల్ ఆలం రోడ్డులోని ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
జ్ఞానవాపి, శృంగార్ గౌరి కేసుల్లో మెయింటెనబిలిటీ (వినడం, వినకపోవడం) అంశంపై అన్ని పార్టీలు ఇప్పటికే తమ వాదనలు ముగించాయి. జులై 4న ముస్లిం పక్షం నుంచి రీప్లే రావాల్సి ఉంది. ముస్లిం తరపు నుంచి న్యాయవాది అభయ్నాథ్ ఈ కేసుల్లో ముఖ్య పాత్ర పోషించారు.
జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టులో విచారణకొనసాగుతున్న కేసులో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరపున అభయ్ నాథ్ వాదిస్తున్నారు.అభయ్ నాథ్ కు గుండెపోటు రావడంతో అతన్ని హుటాహుటిన త్రీమూర్తి ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకుండాపోయింది.