Nayattu Remeke : రావు రమేష్ షాకింగ్ రెమ్యునరేషన్..!
ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం రావు రమేష్ను అడగ్గా.. కాల్షీట్స్ ఎక్కువ అవసరం ఉండడంతో భారీ పారితోషికం డిమాండ్ చేశారట..
Nayattu Remeke: ఫిలిం ఇండస్ట్రీలో టాలెంటెడ్ ఆర్టిస్టుల రెమ్యునరేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఇప్పడు వెర్సటైల్ యాక్టర్ రావు రమేష్ పారితోషికం గురించిన వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం ఆయన భారీగా రెమ్యునరేషన్ అడిగారట.
విలక్షణ నటుడు, స్వర్గీయ రావు గోపాల రావు కొడుకే అయినా తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మగధీర’ లో ఘోర క్యారెక్టర్ చేసింది రావు రమేషే అని చాలా రోజుల వరకు చాలా మందికి తెలియదు. ‘గమ్యం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’.. ఇలా పలు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్, నెగెటివ్ రోల్స్ చేసి ఆడియెన్స్ను ఎంటర్టైన్ చేశారు.
పాపులర్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ ‘పలాస 1978’ ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో.. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నాయట్టు’ (Nayattu) సినిమాను తెలుగులో రీమేక్ చెయ్యనుంది. ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం రావు రమేష్ను అడగ్గా.. కాల్షీట్స్ ఎక్కువ అవసరం ఉండడంతో ఏకంగా కోటి రూపాయల పారితోషికం అడిగారట.
Jr NTR New Car : తారక్.. కొత్త కార్ కిరాక్..!
ఓ మాదిరి చిన్న హీరోలకే కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అలాంటిది క్యారెక్టర్ ఆర్టిస్టుకి ఇంత పెద్ద మొత్తం అంటే ఎక్కువే అని.. రావు రమేష్ లాంటి టాలెంటెడ్ యాక్టర్కి అంత ఇవ్వొచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. సిద్దార్థ్ – శర్వానంద్ నటిస్తున్న మల్టీస్టారర్ ‘మహా సముద్రం’ లో ‘గూని బాబ్జీ’ అనే డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. డైరెక్టర్ కరుణ కుమార్.. సుధీర్ బాబుతో చేసిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ రిలీజ్కి రెడీ అవుతోంది.