అనుమానాస్పద స్థితిలో ఎయిర్ హోస్టెస్ మృతి

  • Published By: murthy ,Published On : May 1, 2020 / 08:38 AM IST
అనుమానాస్పద స్థితిలో ఎయిర్ హోస్టెస్ మృతి

ముంబై లోని ఒక అపార్ట్ మెంట్లో కుళ్లిన స్థితిలో ఉన్న ఎయిర్ హోస్టెస్  మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.  సుల్తానా షేక్ (29) అనే యువతి గోఎయిర్ విమానయాన సంస్ధలో పని చేస్తోంది. తన సహోద్యోగులతో కలిసి  ఆమె ముంబై, విల్లే పార్లే ఈస్ట్ లోని పొద్దార్ వాడి ప్రాంతంలో నివసిస్తోంది. దేశవ్యాప్తంగా మార్చి 25న లాక్ డౌన్ విధించటానికి ముందే తన సహోద్యోగులు  ముంబై విడిచి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె ఒక్కతే ఆపార్ట్ మెంట్లో ఉంటోంది.  

బుధవారం ఏప్రిల్ 29న ఇంటినుంచి దుర్వాసనరావటంతో స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన స్ధితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. పోస్టు మార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించారు. కోవిడ్ పరీక్ష నిర్విహించగా నెగెటివ్ వచ్చింది. గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.(గబ్బిలాల్లో స్వచ్ఛందంగా సామాజిక దూరం)