హైదరాబాద్లో అజిత్.. మాల్దీవుల్లో అఖిల్..
Ajith – Akhil: కోలీవుడ్ స్టార్ హీరో ‘తల’ అజిత్ కుమార్ హైదరాబాద్లో కెమెరా కంట పడ్డారు. క్లీన్ షేవ్తో సరికొత్తగా కనిపిస్తున్న ఆయన లెటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘నెర్కొండ పార్వై’ తర్వాత దర్శకుడు హెచ్. వినోద్, నిర్మాత బోనీ కపూర్, అజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘వలిమై’.. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.
అఖిల్ అక్కినేని మాల్దీవుల్లో చిల్ అవుతున్నాడు. ఒంటరిగా అక్కడి బీచ్లో తిరుగుతూ.. సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో అఖిల్ మాల్దీవ్స్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ రిలీజ్కి రెడీ అవుతోంది. అఖిల్ 5వ సినిమా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చెయ్యబోతున్నాడు.