Akshay Kumar : రెండు సినిమాలూ ఒకే రోజు..! ఖిలాడి ఏమన్నాడంటే..

అక్షయ్ నటించిన ‘బెల్ బాటమ్’, ‘సూర్యవంశీ’ సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి.. అయితే ఈ రెండు సినిమాలు ఓటీటీకే ఓటేస్తున్నాయా? అదీ ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయా?.. దీనిపై అక్షయ్ ఏమంటున్నాడు?..

Akshay Kumar : రెండు సినిమాలూ ఒకే రోజు..! ఖిలాడి ఏమన్నాడంటే..

Akshay Kumar Sooryavanshi And Bell Bottom Movies Releasing On Ott

Akshay Kumar: బీ టౌన్ ఖాన్స్‌ను బీట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ ప్లస్ హై రెమ్యూనరేషన్‌తో దూసుకుపోతున్నాడు ఖిలాడి అక్షయ్ కుమార్. లాస్ట్ ఇయర్ ‘లక్ష్మీ బాంబ్’ మూవీతో డైరెక్ట్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రెజెంట్ అక్షయ్ నటించిన ‘బెల్ బాటమ్’, ‘సూర్యవంశీ’ సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి.. అయితే ఈ రెండు సినిమాలు ఓటీటీకే ఓటేస్తున్నాయా? అదీ ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయా?.. దీనిపై అక్షయ్ ఏమంటున్నాడు?..

ఏడాదికి రెండు, మూడు సినిమాలు పూర్తి చేస్తూ దూకుడు పెంచాడు అక్షయ్ కుమార్. ఎప్పుడూ న్యూ పాయింట్‌తో వచ్చే అక్షయ్ మూవీస్‌కు ఆటోమేటిక్‌‌గా ఆడియెన్స్ లాక్ అయిపోతున్నారు. ప్రెజెంట్ ఈ స్టార్ నటించిన ‘సూర్యవంశీ’, ‘బెల్ బాటమ్’ సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయనే ప్రచారం జరుగుతుంది. దీనికి స్పందించిన అక్షయ్ అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు. తన ప్రాజెక్ట్స్ కోసం ఎదురుచూస్తోన్న ప్రేక్షకులకి థ్యాంక్స్ చెబుతూ ఓటీటీ గురించి ఇంకా ఆలోచించలేదని చెప్పుకొచ్చారు.

‘బెల్ బాటమ్’, ‘సూర్యవంశీ’ రెండూ ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్నాయి అనే వార్తల్లో నిజం లేదన్నారు అక్షయ్. రిలీజ్ డేట్స్ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు మేకర్స్. కొవిడ్ కారణంగా ‘సూర్యవంశీ’ తో పాటూ స్పై థ్రిల్లర్ ‘బెల్ బాటమ్’ పనులూ నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో ఇండిపెండెన్స్ డే రోజు ఏదో ఒకటి వస్తుందనుకున్నా.. అదీ సాధ్యపడట్లేదు. ఓటీటీకి వచ్చే ఛాన్స్ కూడా కనిపించడం లేదు.