అక్షయ్ కుమార్ ఇంట్లో విషాదం

  • Published By: madhu ,Published On : May 16, 2020 / 08:29 AM IST
అక్షయ్ కుమార్ ఇంట్లో విషాదం

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అత్యంత సమీప బంధువు సచిన్ కుమార్ కన్నుమూవారు. 2020, మే 15వ తేదీ శుక్రవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇతని మృతితో అక్షయ్ కుమార్ ఫ్యామిలీ షాకింగ్ కు గురైంది. 2020, మే 13వ తేదీనే సచిన్ బర్త్ డే చేసుకున్న మూడు రోజులకే హఠాన్మరణం చెందడంతో కుటుంసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

సచిన్ మృతి చెందారని తెలుసుకున్న అక్షయ్ వెంటనే ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. మృతదేహం వద్ద ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సచిన్ మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. సచిన్..ఏక్తా కపూర్ నిర్మించిన..కహానీ ఘర్ ఘర్ కీ సినిమాలో హీరోగా నటించారు. అనంతరం నటనకు గుడ్ బై చెప్పి..ఫొటో గ్రాఫర్ గా స్థిరపడ్డారు. శుక్రవారం రాత్రి పడుకుని ఉదయం లేవలేదని అతని స్నేహితుడు రాకేశ్ పాల్ చెప్పారు. 

ఇక అక్షయ్ కుమార్ విషయానికి వస్తే…సూర్యవంశీ’, లక్ష్మీ బాంబ్ సినిమాల్లో నటించారు. ఇవి రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ఇంటికే పరిమితమయ్యారు. వైరస్ కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకు రూ. 30 కోట్లను విరాళంగా అందించారు అక్షయ్. ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ. 25 కోట్లు, ముంబాయి మున్సిపల్ కార్పోరేషన్‌కు రూ. 3 కోట్లు, పోలీస్ విభాగానికి రూ. 2 కోట్లు విరాళం అందచేశారు. 

Read Here>> మాస్కుల ముసుగుల్లో పెళ్లి అవ‌స‌ర‌మా? వీళ్లు సంసారాలు చేస్తారా?: నటి వ్యాఖ్యలు హాట్ టాపిక్