Anand Mahindra: ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వైరల్ వీడియో.. ఎలుగుబంటి చేజింగ్

ఆనంద్ మహీంద్రా.. పారిశ్రామికవేత్త అయినప్పటికీ సొంత బ్రాండ్ ప్రమోషన్ కంటే ఆసక్తికరమైన సోషల్ మీడియా కంటెంట్ షేర్ చేయడంలో ముందుంటారు. పైగా వాటికి స్పెషల్ కామెంట్ పెడుతుంటారు. రీసెంట్ గా మోటార్ సైకిళ్లను వెంటాడుతున్న..

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వైరల్ వీడియో.. ఎలుగుబంటి చేజింగ్

Anand Mahindra

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా.. పారిశ్రామికవేత్త అయినప్పటికీ సొంత బ్రాండ్ ప్రమోషన్ కంటే ఆసక్తికరమైన సోషల్ మీడియా కంటెంట్ షేర్ చేయడంలో ముందుంటారు. పైగా వాటికి స్పెషల్ కామెంట్ పెడుతుంటారు. రీసెంట్ గా మోటార్ సైకిళ్లను వెంటాడుతున్న ఎలుగుబంటి వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా.

తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోకు 52వేల వ్యూస్ వచ్చాయి. పైగా వీడియోను జావా మోటార్ సైకిల్స్ టీంకు ట్యాగ్ చేసి సలహా కూడా ఇచ్చారు. ఇదంతా ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి రికార్డ్ చేశాడు.

టీ గార్టెన్ లో ఇరు వైపులా ఉన్న పొదలు చూపిస్తుండగా వీడియో మొదలైంది. అలా పచ్చని ప్రకృతిలో వెళ్తుండగా.. రోడ్ మీదే మూడు ఎలుగుబంట్లు కనిపించాయి. అంతే వాటిని చూడగానే ఆగిపోయిన ఆ వ్యక్తి దూరం నుంచే చూస్తూ వీడియో రికార్డ్ చేస్తూ ఉండిపోయాడు.

అలా కాసేపు వరకూ అంతా ప్రశాంతంగా ఉన్నా.. కొద్ది సెకన్లు గడిచాక ఒక ఎలుగుబంటి అతని వైపు పరిగెత్తుకురావడం మొదలైంది. దాంతో వీడియో పూర్తి అయింది. ఈ వీడియోను పోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘నీలగిరి పర్వతాల్లో ఏదో ఒక ప్రదేశంలో ఇది జరిగింది. థ్రిల్ కావాలంటే క్లిప్ చివరి వరకూ చూడండి. జావా మోటార్ సైకిల్స్ టీం ఎలుగుబంట్లు వార్నింగ్ ఇస్తే జాగ్రత్తగా ఉండాలనే దానిని ఇంట్రడ్యూస్ చేయాలి’ అని ఆ పోస్టుకు కామెంట్ పెట్టారు.