Andhra Pradesh : విశాఖలో పొలిటికల్ హీట్ .. TDP,జనసేన, వైసీపీ పార్టీల కార్యక్రమాలు .. పోలీసులు అలెర్ట్

మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం అంటూ కాసేపట్లో వైసీపీ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన..మరోవైపు వైసీపీ గర్జనకు కౌంటర్‌గా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని టీడీపీ కార్యక్రమం. ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ పార్టీ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం.ఇలా విశాఖలో మూడు పార్టీల కార్యక్రమాలతో నేడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీల వేర్వేరు కార్యక్రమాలు ఉండటంతో రాష్ట్ర ప్రజలు దృష్టి మొత్తం అటువైపే ఉంది.

Andhra Pradesh : విశాఖలో పొలిటికల్ హీట్ .. TDP,జనసేన, వైసీపీ పార్టీల కార్యక్రమాలు .. పోలీసులు అలెర్ట్

Visakhapatnam with TDP, Janasena and YCP Parties Meetings

Andhra Pradesh  : మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం అంటూ కాసేపట్లో వైసీపీ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన..మరోవైపు వైసీపీ గర్జనకు కౌంటర్‌గా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ పార్టీ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు నేడు విశాఖ చేరుకోనున్నారు. దీంతో విశాఖలో నేడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీల వేర్వేరు కార్యక్రమాలు ఉండటంతో రాష్ట్ర ప్రజలు దృష్టి మొత్తం అటువైపే ఉంది.

మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికట్ జేఏసీ పిలుపునిచ్చిన విశాఖ గర్జన మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకు అధికార వైసీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఇప్పటికే పలువురు మంత్రులు, వైసీపీ ముఖ్య నాయకులు విశాఖకు చేరుకున్నారు. మూడు రాజధానుల నినాదంతో సాగే ఈ భారీ ర్యాలీలో మంత్రులు, పాల్గొననున్నారు.

విశాఖలోని ఎల్‌ఐసీ భవనం సమీపంలోని డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ విగ్రహం నుంచి బీచ్‌ రోడ్డులోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల మేర మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ సాగనుంది. ఈ ర్యాలీలో దాదాపు లక్ష మంది పాల్గొంటారని అంచనా. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాజధానుల వికేంద్రీకరణ గురించి నాన్ పొలిటికల్ జేఏసీ సభ్యులు, మంత్రులు మాట్లాడనున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ మాట్లాడుతూ.. విశాఖ గర్జన ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరోవైపు వైసీపీ బారి నుంచి ఉత్తరాంధ్రను కాపాడుదాం అనే నినాదంతో ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతలు విశాఖలోని టీడీపీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు టీడీపీ సిద్దమైంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. విశాఖపట్నంను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెస్టినేషన్‌గా చేయడంతో పాటు వ్యాపార, పారిశ్రామిక రాజధానిగా అభివృద్ధి చేయడానికి టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఈ సమావేశంలో వివరించనుంది. విశాఖకు చంద్రబాబు నాయుడు ఏం చేశారనే దానిపై సమగ్ర శ్వేతపత్రాన్ని సిద్ధం చేసి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని టీడీపీ భావిస్తోంది.

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాన్ కూడా కార్యాక్రమం చేపట్టారు. ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు విశాఖపట్నంకు చేరుకోనున్నారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ కార్యక్రమాల ఏర్పాట్ల కోసం సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు శుక్రవారమే వైజాగ్ చేరుకున్నారు. పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం విశాఖపట్నం చేరుకుంటారు.విశాఖపట్నంలో జనసేన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. ఇప్పటికే విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. అయితే విశాఖలో భూకజ్జాల గురించి పవన్ కల్యాణ్ ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం.

ఇలా మూడు పార్టీల కార్యక్రమంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 1,100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.