ఐదు రోజుల్లో రూ. 5కోట్లు.. రూ. 7కోట్లు టార్గెట్!
Anushka Sharma-Virat Kohli: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో పరిస్థితి మరింత దిగజారుతోంది. అటువంటి పరిస్థితిలో, ప్రజలకు సహాయం చేయడానికి చాలా మంది స్టార్స్ ముందుకు వస్తున్నారు. అదే సమయంలో, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు అతని భార్య నటి అనుష్క శర్మ కూడా ప్రజలకు సహాయం చేయడానికి నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దేశంలో ఏర్పడిన పరిస్థితులను చూస్తే బాధ వేస్తుందంటూ.. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పేద ప్రజలకు సహాయం చేసే ప్రచారాన్ని ప్రారంభించారు. అందులో 7 రోజుల్లో రూ .7 కోట్లు జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో, అతిపెద్ద మొత్తాన్ని అంటే 2 కోట్లు విరాట్ మరియు అనుష్క స్వయంగా విరాళంగా ఇచ్చారు. విరాట్-అనుష్కలకు ఈ కార్యక్రమంలో మిలియన్ల మంది ప్రజలు మద్దతు ఇచ్చారని చెబుతోంది విరుష్క జంట.
ఈ కార్యక్రమంలో రూ.5 కోట్లు కేవలం 5 రోజుల్లోనే జమ అయినట్లు వెల్లడించారు. విరాట్-అనుష్క ఈ ప్రచారానికి #InThisTogether అనే పేరు పెట్టారు. దీని ద్వారా 7 రోజుల్లో 7 కోట్ల రూపాయలు వసూలు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. వారు వారి టార్గెట్ రీచ్ అవ్వడంలో చాలావరకు విజయం సాధించారు. రాబోయే 2 రోజుల్లో, 1.78 కోట్ల రూపాయలు వస్తే వారి టార్గెట్ రీచ్ అవుతామని విరుష్క జంట చెబుతుంది.
విరాట్, అనుష్క వచ్చిన మొత్తాన్ని ACT గ్రాంట్లకు కేటాయించనున్నారు. అవసరమైన వారికి ఆక్సిజన్, మందులు మరియు టీకా సౌకర్యాన్ని అందించడానికి ఈ సహాయం ఉపయోగపడుతుంది. ఈ సమయంలో మన దేశం చాలా కష్టమైన దశలో ఉంది. ఇబ్బందుల్లో ఉన్న మన దేశానికి మనందరి అవసరం ఉంది. అంటూ విరుష్క జంట సందేశాన్ని ఇచ్చారు.