శ్రీవారి భక్తులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్

శ్రీవారి భక్తులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్

ap rtc good news for srivari devotees: తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు రూ.300 శీఘ్రదర్శనం టికెట్లను పొందే అవకాశం కల్పించింది ఆర్టీసీ. రోజుకు వెయ్యి శ్రీవారి దర్శనం టికెట్లను ఆర్టీసీ అందుబాటులో ఉంచనుంది. ఆ టికెట్ల కోసం తిరుమల బస్ స్టేషన్ దగ్గర ఆర్టీసీ సూపర్ వైజర్లు అందుబాటులో ఉండనున్నారు. తిరుమలలో ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు శీఘ్ర దర్శనం ఏర్పాటు చేస్తారు. దూర ప్రాంతాల వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.

ఏపీ ఆర్టీసీ ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతోంది. ప్రతీ డిపో నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది.