AP-Telangana Boarder: సరిహద్దులో అంబులెన్సులు.. ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టు స్టే!

తెలంగాణ.. ఆంధ్రా సరిహద్దులలో అంబులెన్సుల అనుమతిపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ ఆసుపత్రిలో బెడ్ రిజర్వ్ ఉంటేనే సరిహద్దులో ఏపీ నుండి వచ్చే అంబులెన్సులకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది.

AP-Telangana Boarder: సరిహద్దులో అంబులెన్సులు.. ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టు స్టే!

Ap Telangana Boarder1

AP-Telangana Boarder: తెలంగాణ.. ఆంధ్రా సరిహద్దులలో అంబులెన్సుల అనుమతిపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ ఆసుపత్రిలో బెడ్ రిజర్వ్ ఉంటేనే సరిహద్దులో ఏపీ నుండి వచ్చే అంబులెన్సులకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పేర్కొంది. సర్క్యులర్‌లో మార్పులు చేసి కొత్త సర్క్యులర్ జారీ చేయాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ నుండి కరోనా రోగులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాదు వెళుతుండగా, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన తెలంగాణ పోలీసులు అంబులెన్సులను నిలిపివేస్తున్నారు. హైదరాబాద్ ఆసుపత్రిలో బెడ్ ఉంటేనే ఎంట్రీ ద్వారాలు తెరుస్తున్నారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా, నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులు పట్టించుకోలేదంటూ తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైద్య సహాయం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషంట్లు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్న హైకోర్టు అంబులెన్స్‌లు ఆపొద్దని తెలంగాణ పోలీస్‌శాఖకు ఆదేశించింది. పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్‌ అయింది. ఏపీ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించగా.. ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలపై హైకోర్టు సానుకూలత వ్యక్తం చేసింది. రాష్ట్రాలు ఎంట్రీని నిలువరిస్తే ఆర్టికల్‌ 14 ఉల్లంఘనేనని ఏపీ ఏజీ పేర్కొనగా హైకోర్టు ఏకీభవించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు హైకోర్టు వాయిదా వేస్తూ తదుపరి ఉత్తర్వుల వరకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించింది.