Arunachalam : పొర్లుదండాలతో భక్తురాలు 14 కి.మీ గిరి ప్రదక్షిణ..కరోనా నుంచి కాపాడు స్వామీ..

కరోనా నుంచి మానవాళిని కాపాడు స్వామీ అంటూ ఏపికి చెందిన ఓ భక్తురాలు అరుణాచలం కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు. మొత్తం 14 కిలోమీటర్లు మాధవి అనే భక్తురాలు గిరి ప్రదక్షిణ చేశారు.

Arunachalam : పొర్లుదండాలతో భక్తురాలు 14 కి.మీ గిరి ప్రదక్షిణ..కరోనా నుంచి కాపాడు స్వామీ..

Arunachalam (1)

Arunachalam : తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు. తిరువణ్ణామలై గిరిప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఏ పుణ్యక్షేత్రంలోనైనా భక్తులు కేవలం దేవాలయం చుట్టూ మాత్రమే ప్రదక్షిణలు చేస్తారు. లేదా పొర్లుదండాలు పెడతారు. కానీ తిరుమణ్ణామలై అంటే అంటే ఓ కొండ. ఆ కొండ కోవెల. స్వామి అగ్నిలింగంగా వెలసిన పుణ్యక్షేత్రం తిరుమణ్ణామలై.

తిరువణ్ణామలై చుట్టూ మొత్తం గిరిప్రదక్షిణ 14 కిలోమీటర్లను ఓ భక్తురాలు పొర్లు దండాలు పెట్టి ‘‘స్వామీ ఈ కరోనా మహమ్మారి నుంచి మానవాళిని కాపాడు స్వామీ’అంటూ వేడుకుంది. సదరు భక్తురాలు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకి చెందిన మాధవి.

తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో మంగళవారం (జూన్ 22,2021) 14 కిలోమీటర్లు గిరివలయం రోడ్డుపై అంగప్రదక్షిణ చేసింది. అరుణాచలేశ్వరాలయంలో పౌర్ణమి రోజున భక్తులు గిరిప్రదక్షిణ (గిరివలయం) చేస్తుంటారు. ముఖ్యంగా చిత్ర పౌర్ణమి, కార్తీక దీపోత్సవ పౌర్ణమి రోజున వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి గిరిప్రదక్షిణలో పాల్గొంటారు.

అరుణాచలం నాలుగైదు ఉపశిఖరాలుండి అనేక కోణాలనుంచి కనిపించే ఏకైక ముఖ్యశిఖరంతో అలరారే ఏకపర్వతం. పరిక్రమ లేక ప్రదక్షిణ అంటే అరుణాచలం చుట్టూ వున్న 14 కి.మీ.ల మార్గాన్ని సవ్యదిశలో పాదరక్షలు లేకుండా నడచి పూర్తిచెయ్యడం. అంటే, గిరి కుడివైపుకు వచ్చేలా చుట్టిరావడాన్ని గిరిప్రదక్షిణం అంటారు.