Ashwini Dutt : ఆ సినిమా తీసి 12 కోట్లు పోగొట్టుకున్నాం.. జగదేకవీరుడు అతిలోకసుందరి పార్ట్ 2 నా చివరి సినిమా..

ఇక సినిమాలు ఆపేయాలి అనుకుంటే నా చివరి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్‌ 2 అవ్వాలనుకుంటున్నాను అని తెలిపారు. అయితే అది ఎవరితో తీయాలి అనుకుంటున్నారో........

Ashwini Dutt : ఆ సినిమా తీసి 12 కోట్లు పోగొట్టుకున్నాం.. జగదేకవీరుడు అతిలోకసుందరి పార్ట్ 2 నా చివరి సినిమా..

jagadekaveerudu athiloka sundari

Ashwini Dutt :  టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘సీతారామం’ సినిమా మంచి విజయం సాధించి, కలెక్షన్లు కూడా బాగా తీసుకొస్తుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామన్ సినిమాని దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించగా స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. తాజాగా ఆయన ‘ఆలీతో సరదాగా’ టాక్ షోలో పాల్గొని, సీతా రామం చిత్రంతో పాటు పలు ఆసక్తికర విషయాలను తెలియచేశారు. తాజాగా ఈ ప్రోమో రిలీజ్ చేశారు.

అశ్వినీదత్ మాట్లాడుతూ.. ”పెళ్లి సందడి సినిమాను హిందీలో తీశాం. అది బాగానే ఆడింది. ఆ తర్వాత నేను, అరవింద్‌ గారు కలిసి అనిల్‌ కపూర్‌తో చూడాలని ఉంది సినిమా హిందీలో రీమేక్ చేశాం. ఆ సినిమా వల్ల మా ఇద్దరికీ చెరో ఆరు కోట్లు అంటే మొత్తం 12 కోట్లు నష్టపోయాం. దాని నుంచి తేరుకోవడానికి చాలానే సమయం పట్టింది” అని తెలిపారు.

Nayan-Vignesh : సెకండ్ హనీమూన్‌కి చెక్కేసిన నయన్, విగ్నేష్.. ఈ సారి స్పెయిన్‌లో..

ఇక సినిమాలు ఆపేయాలి అనుకుంటే నా చివరి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్‌ 2 అవ్వాలనుకుంటున్నాను అని తెలిపారు. అయితే అది ఎవరితో తీయాలి అనుకుంటున్నారో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. 1990లో చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా భారీ విజయం సాధించింది. కొన్నేళ్ల క్రితం ఈ సినిమా సీక్వెల్ ని చరణ్, జాన్వీ కపూర్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు కానీ అది కుదర్లేదు. తాజాగా ఆ సినిమా పార్ట్ 2 కచ్చితంగా తెరకెక్కిస్తాను అని అశ్వినీదత్ చెప్పడంతో సినీ ప్రేమికుల్లో ఆసక్తి పెరిగింది.