ఆరోగ్యశాఖా మంత్రితో సహా.. బిర్యానీ తిన్న 145 మందికి అస్వస్థత

ఆరోగ్యశాఖా మంత్రితో సహా.. బిర్యానీ తిన్న 145 మందికి అస్వస్థత

biryani-reaction

Assam : 145 fell ill after having biryani : అస్సాంలో సాక్షాత్తూ సీఎం సమక్షంలోనే బిర్యానీ తిన్న 145మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతతకు గురైనవారిలో సీఎం సర్బానంద సోనోవాల్‌ కూడా ఉండటం తీవ్ర కలకలం రేపింది…!!. CM సర్బానంద సోనోవాల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో CM సర్బానంద సోనోవాల్‌ తో సహా 145మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

మంగళవారం (జనవరి 2) CM సర్బానంద సోనోవాల్‌ ముఖ్య అతిథిగా హాజరైన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ వల్ల 145 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఉండటం గమనించాల్సిన విషయం.

రాష్ట్రంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా డిఫు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ అకాడమిక్‌ సెషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 8,000 మంది హాజరయ్యారు. వీరందరికి ఆహారంగా బిర్యానీ ప్యాకెట్స్‌ ఇచ్చారు. ఇది తిన్నవారిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మతో సహా 145మంది అస్వస్థతకు గురయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ‘‘కార్యక్రమానికి వచ్చిన వారందరికి బిర్యానీ ప్యాకెట్స్‌ ఇచ్చాం. నేను కూడా అదే బిర్యానీ తిన్నాను. కానీ..కాసేపటి తర్వాత అనారోగ్యానికి గురయ్యాను. దీంతో వెంటనే చికిత్స తీసుకున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. ఎవ్వరూ ఆందోళన పడవద్దని కోరారు. నాతో పాటు మరో 145 మంది అస్వస్థతకు గురయ్యారు. అందరిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నామనీ వారి గురించి ఎవ్వరూ ఆందోళన పడవద్దని సూచించారు. వీరిలో 28 మందిని డిశ్చార్జ్‌ అయ్యారనీ..మరో 118మందికి చికిత్స కొనసాగుతోంది. అందరూ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.

కాగా సాక్షాత్తూ సీఎం పాల్గొన్న కార్యక్రమంలో ఇటువంటి ఘటనకు దారితీసిన పరిస్థితులపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఈ విషయాన్ని కర్బీ ఆంగ్లాంగ్ డిప్యూటీ కమిషనర్ ఎన్‌జీ చంద్ర ధ్వాజా సింఘా తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి మంగళవారం రాత్రి ఆసుపత్రిలో మరణించాడు. అయితే అతను ఫుడ్‌ పాయిజన్‌ వల్ల చనిపోయాడా లేక వేరే కారణమా అనేది ఇంకా తెలియలేదు. అతడు తీసుకున్న ఆహార నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపారు. ఆసుపత్రిలో చేరిన వారు కడుపు నొప్పి, వాంతులతో బాధ పడుతున్నట్లు డాక్టర్లు తెలిపారని చెప్పారు.