ఫ్యామిలీతో కలిసి ‘ఉప్పెన’ చూసిన బాలయ్య..

ఫ్యామిలీతో కలిసి ‘ఉప్పెన’ చూసిన బాలయ్య..

Balakrishna: మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ తో బాక్సాఫీస్ వద్ద ‘ఉప్పెన’ క్రియేట్ చేస్తున్నాడు… మొదటి వారం రికార్డ్ రేంజ్ కలెక్షన్లు రాబట్టి ప్రపంచ వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో అనే నిజాన్ని నిరూపించింది ‘ఉప్పెన’..

uppena

ఈ మూవీకి సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా నటసింహ నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ‘ఉప్పెన’ సినిమా ప్రత్యేక ప్రదర్శన చూశారు. సినిమా ఆద్యంతం ఎంజాయ్ చేసిన బాలయ్య నటీనటులను, సాంకేతిక నిపుణులను, దర్శకుడు బుచ్చి బాబును ప్రత్యేకంగా అభినందించారు.

uppena

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం అయినా ఎక్కడా బెరుకు లేకుండా అనుభవం ఉన్న నటుడిలా కనిపించాడని, హీరో హీరోయిన్లు, విజయ్ సేతుపతి, సంగీతం, కథ కథనాలు సినిమాకు మూలస్థంభాలుగా నిలిచాయని బాలయ్య అన్నారు.