సమాధానం చెప్పను, ఎవరికీ భయపడను.. నాగబాబు వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందన

నందమూరి బాలకృష్ణ, నాగబాబు మధ్య మాటల యుద్ధం ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. మంత్రి

  • Published By: naveen ,Published On : June 1, 2020 / 02:55 PM IST
సమాధానం చెప్పను, ఎవరికీ భయపడను.. నాగబాబు వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందన

నందమూరి బాలకృష్ణ, నాగబాబు మధ్య మాటల యుద్ధం ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. మంత్రి

నందమూరి బాలకృష్ణ, నాగబాబు మధ్య మాటల యుద్ధం ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకున్నారనే బాలయ్య ఆరోపణలకు కౌంటర్‌గా నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆ తర్వాత నాగబాబు వ్యాఖ్యలకు బాలయ్య ఎలాంటి స్పందన ఇవ్వలేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు ఇష్యూపై బాలయ్య స్పందించారు. 

సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు:
”నాగబాబు వ్యాఖ్యలపై నేనేమీ చెప్పుదలచుకోలేదు. నేను ఎవరికీ భయపడను. నా వ్యక్తితత్వం గురించి భయం లేదు. ఎవరైనా నాకు మర్యాద ఇచ్చి  పుచ్చుకోవాల్సిందే. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటా. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమూ లేదు” అని బాలయ్య ఫైర్ అయ్యారు. అంతేకాదు ”ఇండస్ట్రీలో ఎవరైనా మమ్మల్ని ఫాలో కావాల్సిందే. చరిత్ర సృష్టించాలన్న మేమే .. దాన్ని తిరగరాయాలన్న మేమే”  అంటూ సింహా సినిమాలోని డైలాగులు చెప్పుకొచ్చారు. తాజాగా బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలకు నాగబాబు స్పందిస్తారా? ఏమైనా కౌంటర్ ఇస్తారా? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

అసలేం జరిగిందంటే:
సినిమా షూటింగ్ లు, థియేటర్స్ రీ ఓపెన్ లాంటి అంశాలపై చిరంజీవి నేతృత్వంలో పలువురు దర్శకనిర్మాతలు తెలంగాణ ప్రభుత్వంలో జరిపిన చర్చలకు తనని పిలవలేదని ఆగ్రహంతో ఊగిపోతూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకోవడానికి మాత్రమే కలిసారంటూ కామెంట్స్ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలని బాలయ్యకు వార్నింగ్ ఇచ్చారు. ఇండస్ట్రీకి, తెలంగాణ ప్రభుత్వానికి బాలక్రిష్ణ సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా ఈ వివాదం ముదిరిపోయింది. నందమూరి, మెగా కంపౌండ్స్ మధ్య ఉన్న వైరం మరోసారి బయటపడింది.