బాలయ్య అంటే ఇందుకే పిచ్చి.. అభిమానికి ఫోన్లో పరామర్శ.. ఉద్వేగానికి గురైన మనోహర్..
Balayya: బాలయ్యకి అభిమానులు ఉండడం సహజం.. కొట్టినా, తిట్టినా, వీరాభిమానులు ఎందుకుంటారంటే ఇందుకే.. బాలయ్య బాబును ప్రేమించే వారికి బాలయ్యే అభిమానిగా మాట్లాడితే ఇలానే ఉంటుంది మరి..
నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన నందమూరి బాలకృష్ణ వీరాభిమాని పత్తి మనోహర్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న బాలయ్య బాబు తన ఆప్తుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఆ అభిమాని ఇంటికి వెళ్ళి అండగా ఉంటామని భరోసా ఇవ్వమని ఆజ్ఞాపించారు.
దీంతో కోటంరెడ్డి, రెడ్డి పట్టణంలోని నందమూరి వంశ వీరాభిమాని పత్తి మనోహర్ ఇంటికి వచ్చి వారి సమస్యను తెలుసుకుని బాలయ్య బాబుకు ఫోన్ ద్వారా వివరించారు..
బాలయ్య బాబు పత్తి మనోహర్ కు ఫోన్ ఇవ్వమని చెప్పగా మనోహర్ ఒక్క సారిగా భావోద్వేగానికిలోనై కంటతడి పెట్టుకున్నాడు.
బాలయ్య ధైర్యాన్ని ఇస్తూ ‘నువ్వు మరళా మామూలు మనిషివి అవుతావు’ అంటూ భరోసానిచ్చారు. ‘మన వాళ్ళందరూ నీకు అండగా ఉంటారు. మన కుటుంబ సభ్యుడిని కాపాడుకోవడం నాహక్కు’ అంటూ తెలిపారు. అనంతరం మనోహర్ శ్రీమతితో కూడా మాట్లాడుతూ.. ‘ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని, మనోధైర్యంగా ఉండాలని, మనవాళ్ళంరూ అండగా ఉండి సహకరిస్తారని’ తెలిపారు.
అభిమానికి ఆపద అంటే ఆయన ఎప్పుడూ ముందే ఉంటాడు ??
అనారోగ్యంతో బాధపడుతున్న నెల్లూరు జిల్లా కావలి కి చెందిన బాలయ్య అభిమాని మనోహర్ కు బాలయ్య ధైర్యం చెప్పాడు ❤️
బాలయ్య బాబు పత్తి మనోహర్ కు ఫోన్ ఇవ్వమని చెప్పగా మనోహర్ ఒక్క సారిగా భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నాడు. #JaiBalayya pic.twitter.com/cfCEYdx2EL— GopiNath NBK (@Balayya_Garu) February 14, 2021