Himachal Pradesh : బర్త్‌ డే గిఫ్ట్‌ అదిరింది.. భార్యకు చంద్రుడుపై స్థలం కొన్న భర్త

Himachal Pradesh : బర్త్‌ డే గిఫ్ట్‌ అదిరింది.. భార్యకు చంద్రుడుపై స్థలం కొన్న భర్త

Capture

Himachal Pradesh : సాధారణంగా తమ భార్యపై ఉన్న ప్రేమను వ్యక్త పరిచేందుకు బంగారం లేదా ఎక్కడికైనా తీసుకెళ్లి సర్‌ ఫ్రైజ్‌ ఇచ్చారు భర్తలు. లేకుండా రకరకాల ఖరీదైన బహుమతులు ఇచ్చి..తమ ప్రేమను వ్యక్త పరుస్తారు. కానీ ఓ భర్త.. తన భార్య పుట్టిన రోజు సందర్భంగా తమ ప్రేమను వేరే లెవల్లో చాటుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరూ ఇవ్వని వైరటీ గిఫ్ట్‌ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. అది చూసిన భార్య ఇలాంటి బహుమతిని తానెప్పుడూ ఊహించలేదని అని చెప్పింది.
Covid Cases In India: దేశంలో కొనసాగుతున్న కొవిడ్ విజృంభణ.. 91వేలు దాటిన యాక్టివ్ కేసులు
హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం కంగ్రా జిల్లాకు చెందిన హరీశ్‌ మహాజన్‌.. జూన్‌ 23న తన భార్య పూజాసూద్‌ పుట్టిన రోజు కావడంతో అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఏకంగా తన భార్యకు చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చాడు. దీని కోసం ఇంటర్నేషనల్‌ లునార్‌ ల్యాండ్‌ సొసైటీకి దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాది ప్రక్రియ తర్వాత సొసైటీ రిజిస్ట్రేషన్‌ సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్‌ లో పంపించారు పుట్టిన రోజున విభిన్నమైన బహుమతిని అందుకోవడంతో భార్య పూజాసూద్‌ ఆనందం వ్యక్తం చేస్తుంది.

PM Modi: కళా ప్రేమికుల కోసం అందుబాటులోకి ప్రగతి మైదాన్ టన్నెల్
హరీష్ మహాజన్ చండీగఢ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అతని భార్య పూజాసూద్ సిమ్లాలోని డీఏవీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇక చంద్రమండలంపై హిమాచల్ ప్రదేశ్ నుంచి భూమి కొనుగోలు చేసిన రెండో వ్యక్తిగా హరీశ్‌చంద్ నిలిచారు. గతంలో ఉనా జిల్లాకు చెందిన ఓ వ్యాపారి కూడా చంద్రమండలంపై భూమిని కొనుగోలు చేసి..తన కొడుకు బర్త్‌ డేగా ఈ బహుమతిని ఇచ్చాడు.