Saroornagar Murder: సరూర్నగర్ పరువు హత్యపై గవర్నర్కు బీజేపీ నేతల ఫిర్యాదు
సరూర్నగర్లో పరువు హత్య రాజకీయ రంగు పులుముకుంటుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దళితులపై దాడులు, హత్యలు జరుగుతున్న తెరాస ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ..

Saroornagar Murder: సరూర్నగర్లో పరువు హత్య రాజకీయ రంగు పులుముకుంటుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దళితులపై దాడులు, హత్యలు జరుగుతున్న తెరాస ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను బీజేపీ రాష్ట్ర నాయకులు కలిశారు. ఈ సందర్భంగా హత్యకు గురైన నాగరాజు కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. నాగరాజు కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని గవర్నర్కు బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు.
Asaduddin Owaisi: సరూర్నగర్ పరువు హత్య ఘటనపై స్పందించిన ఓవైసీ.. నిందితులను..
ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని నడిబొడ్డన పరువు హత్య జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యకు గురైన నాగరాజు కుటుంబానికి ప్రాణహాని ఉందని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని మాత్రమే అరెస్టు చేశారని, మరో ఇద్దరిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను వెంటనే శిక్షించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం మధ్యాహ్నం నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
Inter Religion Marriage: మరో దారుణానికి దారితీసిన మతాంతర వివాహం
ఇదిలా ఉంటే సరూర్నగర్ పరువు హత్యపై ఇప్పటికే గవర్నర్ తమిళిసై స్పందించారు. కేసుపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు పరువు హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని కాపాడేందుకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నిస్తున్నాడని, టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి మృతుని కుటుంబానికి న్యాయం జరగకుండా చేస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శించారు. దీనిపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ.. సరూర్ నగర్ పరువు హత్య క్షమించరాని నేరమని, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని, అలాంటి వారికి మా మద్దతు ఉండదని వివరించారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నేతలు గవర్నర్ను కలిసి హత్యకు గురైన నాగరాజు కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
- పోలీస్ దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు
- Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద
- Police Jobs : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే ఆఖరు
- CM KCR: నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్.. ఎవరెవరితో భేటీ అవుతారంటే..
- Telangana : రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది..అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలను ప్రోత్సహించాలి
1Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్న్యూస్..!
2Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
3Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
5Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
6KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
7Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
8Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
9Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్లర్గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
10Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!