Rahul Gandhi: నా ఇమేజ్‌ను దెబ్బతీయడానికి బీజేపీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది: రాహుల్

‘‘నా ఇమేజ్‌ను దెబ్బతీయడానికి బీజేపీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఇది నాకు నష్టం చేకూర్చుతుందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే, ఇది నాకు లాభాన్నే చేకూర్చుతుంది.. ఎందుకంటే సత్యం నా వైపు ఉంది. నా మీద వ్యక్తిగత దాడులు చేస్తున్నారు.. దీంతో నేను సరైన దారిలోనే వెళ్తున్నానని దాన్ని బట్టే తెలుస్తోంది’’ అని అన్నారు.

Rahul Gandhi: నా ఇమేజ్‌ను దెబ్బతీయడానికి బీజేపీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది: రాహుల్

Rahul Gandhi

Rahul Gandhi: బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలు ఆరోపణలు గుప్పించారు. మధ్యప్రదేశ్ లో భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘నా ఇమేజ్‌ను దెబ్బతీయడానికి బీజేపీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఇది నాకు నష్టం చేకూర్చుతుందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే, ఇది నాకు లాభాన్నే చేకూర్చుతుంది.. ఎందుకంటే సత్యం నా వైపు ఉంది. నా మీద వ్యక్తిగత దాడులు చేస్తున్నారు.. దీంతో నేను సరైన దారిలోనే వెళ్తున్నానని దాన్ని బట్టే తెలుస్తోంది’’ అని అన్నారు.

తాను చేస్తున్న భారత్ జోడో యాత్ర ద్వేషానికి, దేశంలో పెరుగుతున్న ధరలకు, నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ఇంతటి దుర్భరస్థితిలో ఎన్నడూలేదని చెప్పారు. భారత ప్రజల సంస్కృతి గురించి ప్రపంచం మొత్తం తెలుసని అన్నారు. ప్రేమ, దయ, పరస్పర గౌరవమే మన సంస్కృతి అని చెప్పారు.

Kim’s Daughter: మరోసారి తన కూతురితో కలిసి సైనికుల వద్దకు కిమ్.. ఏం సందేశం ఇస్తున్నారు?

కాగా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్ మధ్య కొనసాగుతున్న గొడవలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఆ ఇద్దరు నేతలూ తమ పార్టీ సంపదలాంటి వారని చెప్పారు. ఆ ఇద్దరు నేతలూ తమ పార్టీకి ముఖ్యమేనని వివరించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇప్పటికే తమిళనాడు, కేరళ, ఏపీ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలో ముగిసింది. దేశం మొత్తాన్ని ఏకం చేయడానికే తాము పాదయాత్ర చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..