Lunar Eclipse 2022 : నేడే అరుదైన బ్లడ్ మూన్.. ఆకాశంలో అద్భుతాన్ని తప్పకుండా చూడాల్సిందే అంటున్న శాస్త్రవేత్తలు

సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత్ లో పూర్తి స్తాయి గ్రహణం 45 నిమిషాల పాటు దర్శనం ఇవ్వనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల సహా పలు ఆలయాలు 11 గంటల పాటు మూతపడనున్నాయి. శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉండనుంది.

Lunar Eclipse 2022 : నేడే అరుదైన బ్లడ్ మూన్.. ఆకాశంలో అద్భుతాన్ని తప్పకుండా చూడాల్సిందే అంటున్న శాస్త్రవేత్తలు

Lunar Eclipse 2022 : రేపు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత్ లో పూర్తి స్తాయి గ్రహణం 45 నిమిషాల పాటు దర్శనం ఇవ్వనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల సహా పలు ఆలయాలు 11 గంటల పాటు మూతపడనున్నాయి. శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉండనుంది.

ఈ ఏడాది చిట్టచివరి చంద్రగ్రహణం కార్తిక పౌర్ణమి రోజు అనగా మంగళవారం(నవంబర్ 8) ఏర్పడనుంది. సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల్లోనే చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం కనిపించనుంది. భారత్ లో పూర్తి స్థాయి గ్రహణం సాయంత్రం 5గంటల 32 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 18 నిమిషాల వరకు కనిపిస్తుంది. 45 నిమిషాల 48 సెకన్ల పాటు చంద్రగ్రహణం వీక్షించవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

దేశంలోని అన్ని ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత గ్రహణం చూసే అవకాశం ఉందని వెల్లడించారు. మన దేశంలో ముఖ్యంగా కోల్ కతాలో సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తి స్థాయిలో వీక్షించవచ్చు. హైదరాబాద్ లో సాయంత్రం 5గంటల 44 నిమిషాల నుంచి 6గంటల 18 నిమిషాల వరకు చంద్రగ్రహణం కనిపించనుంది.

Lunar Eclipse: రేపే చంద్ర గ్రహణం.. ఏయే నగరాల్లో చూడొచ్చు.. హైదరాబాద్‌లో ఉంటుందా?

కాగా.. చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చని, ఎటువంటి పరికరాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సూర్యగ్రహణం తరహాలో ప్రత్యేక పరికరాలు పెట్టుకుని చంద్రగ్రహణాన్ని చూడాల్సి అవసరం లేదన్నారు. వాతావరణం అనుకూలిస్తే పూర్తి స్థాయిలో ఎర్రగా మారిన చంద్రుడిని చూడొచ్చు.

భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం కారణంగా చంద్రుడు ఎర్రగా మారనున్నాడు. భూమి నీడ పడినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కాంతి తరంగాలు ఫిల్టర్ అవుతాయి. దీంతో చంద్రుడు ఎరుపు నారింజ వర్ణంలో కనిపిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ అంటారు. చంద్రగ్రహణం భారత్ తో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కనిపించనుంది.

చంద్రగ్రహణం కారణంగా రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. తిరుమల ఆలయాన్ని 11 గంటల పాటు మూసివేయనున్నారు. ఉదయం 8గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 7గంటల 30 నిమిషాల వరకు ఆయల తలుపులు మూసి ఉంచుతారు. గ్రహణం ముగిసిన అనంతరం సంప్రోక్షణ, ప్రదోషపు కాల పూజలు నిర్వహించి ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. మంగళవారం సర్వ దర్శనం టోకెన్లు, బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అయితే చంద్రగ్రహణం కారణంగా ఆలయాలన్నీ మూతపడ్డా ఒక్క శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో ఇక్కడ రాహు, కేతువులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక సంపూర్ణ చంద్రగ్రహణం మళ్లీ మూడేళ్ల తర్వాత 2025 మార్చి 14న ఏర్పడనుందని నాసా తెలిపింది.

చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. అయితే, మూఢనమ్మకాలను, అపోహలను, అనుమానాలను, భయాలను పక్కన పెట్టి ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.