boris johnson: బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్‌తో కలిసి ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడ హలోల్‌లో కొత్తగా ప్రారంభమైన ఒక జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించారు.

boris johnson: బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని

Boris Johnson

boris johnson: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇండియా వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉత్సాహంగా గడుపుతున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్‌తో కలిసి గురువారం ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడ హలోల్‌లో కొత్తగా ప్రారంభమైన ఒక జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా బుల్డోజర్ ఎక్కిన బోరిస్, కొద్దిసేపు దాన్ని ఆపరేట్ చేశారు. అలాగే బుల్డోజర్ పైనుంచి చేయి ఊపుతూ, ఫొటోలకు పోజు ఇచ్చారు.

UK PM Boris Johnson : అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పి నూలు వడికిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బోరిస్ జాన్సన్ రోడ్డు షో ద్వారా హోటల్‌కు చేరుకున్నారు. గుజరాత్ (అహ్మదాబాద్) పర్యటన పూర్తి చేసుకున్న అనంతరం బోరిస్ జాన్సన్ ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ శుక్రవారం భారత ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. కీలక అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకుంటారు. బ్రిటన్ ప్రధాని గుజరాత్ సందర్శించడం ఇదే తొలిసారి. త్వరలో గుజరాత్ ఎన్నికలు జరగనున్నదృష్ట్యా బోరిస్ జాన్సన్, ఆ రాష్ట్రాన్ని సందర్శించడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.