లోషన్ ఆర్డర్ చేస్తే…రూ. 19 వేల ఇయర్ బడ్స్ డెలివరీ

  • Published By: madhu ,Published On : June 12, 2020 / 05:54 AM IST
లోషన్ ఆర్డర్ చేస్తే…రూ. 19 వేల ఇయర్ బడ్స్ డెలివరీ

ఆన్ లైన్ లో ఏదైనా ఆర్డర్ చేస్తే..మరొకటి ఆర్డర్ రావడం చూస్తుంటాం..వింటుంటాం. మరొక వస్తువు డెలివరీ చేశామని..సారీ అంటుంటాయి కొన్ని ఆన్ లైన్ సంస్థలు. ఇలాంటి సందర్భాల్లో విసుగు రావడమే కాకుండా..నష్టపోతుంటారు. ఆ ప్రొడక్ట్ ను వెనక్కి తీసుకుని..మళ్లీ కావాల్సిన వస్తువు పంపిస్తున్న ఘటనలు చూస్తూనే ఉంటాం. లేకపోతే..డబ్బులను రిటర్న్ చేస్తుంటారు. అయితె..అమెజాన్ ఓ వ్యక్తి విషయంలో భిన్నంగా స్పందించింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది. 

గౌతం రెజె అనే వ్యక్తి అమెజాన్ లో రూ. 300 విలువైన స్కిన్ లోషన్ ఆర్డర్ చేయడం జరిగిందని అతను వెల్లడించాడు. కానీ తీరా..వచ్చినది చూస్తే..బోస్ కంపెనీకి చెందిన రూ. 19 వేల విలువైన వైర్ లెస్ ఇయర్ బడ్స్ వచ్చాయన్నారు. కస్టమర్ కేర్ ను సంప్రదించి రిటర్న్ చేస్తానని చెబితే..అమెజాన్ వద్దని చెప్పిందని తెలిపాడు. ఆర్డర్ చేసిన స్కిన్ లోషన్ నాన్ రిటర్నబుల్ జాబితాలో వచ్చిందని తెలుస్తోంది. 

తప్పుడు వస్తువు డెలివరీ చేసినందుకు గాను..అమెజాన్ అతనికి రూ. 300 డబ్బును కూడా రీఫండ్ చేసిందని సమాచారం. ఈ విషయాన్ని గౌతం ట్విట్టర్ వేదికగా వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. నెటిజన్లు తోచిన విధంగా స్పందిస్తున్నారు. గతంలో తమకు కూడా ఇలాగే జరిగిందంటూ ఫొటోలు పోస్టు చేస్తున్నారు. 

 

Read:  మానవత్వాన్ని చంపేస్తున్న కరోనా :మృతదేహాన్ని చెత్తబండిలో పడేసి..