Mithra Sharma: సన్నీలియోన్ విడుదల చేయనున్న ‘బాయ్స్’ టీజర్

టాలీవుడ్ లో మరో యూత్ ఫుల్ టీనేజ్ కథతో తెరకెక్కిన సినిమా రాబోతుంది. మిత్రా శర్మ అనే నటి నిర్మాతగా మారి రూపొందిస్తున్న ఈ సినిమా టీజర్ శుక్రవారం సన్నీలియోన్ చేతుల మీదుగా విడుదల కానుంది. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా ఇప్పటికే విడుదలైన రాజా హే రాజా అనే యూత్ ఫుల్ కాలేజ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Mithra Sharma: సన్నీలియోన్ విడుదల చేయనున్న ‘బాయ్స్’ టీజర్

Mithra Sharma (1)

Mithra Sharma: టాలీవుడ్ లో మరో యూత్ ఫుల్ టీనేజ్ కథతో తెరకెక్కిన సినిమా రాబోతుంది. మిత్రా శర్మ అనే నటి నిర్మాతగా మారి రూపొందిస్తున్న ఈ సినిమా టీజర్ శుక్రవారం సన్నీలియోన్ చేతుల మీదుగా విడుదల కానుంది. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా ఇప్పటికే విడుదలైన రాజా హే రాజా అనే యూత్ ఫుల్ కాలేజ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను శ్రీమణి రచించగా ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. స్మరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు మిత్ర శర్మ. జూలై 16 సాయంత్రం 5 గంటలకు బాయ్స్ చిత్ర టీజర్ సెన్సేషనల్ హీరోయిన్ సన్నీ లియోన్ విడుదల చేయనున్నారు. మిత్రా శర్మకి జోడిగా గీతానంద్ నటిస్తుండగా దయానంద్ అనే యువకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కాగా, ఇప్పటి వరకు హీరోలు నిర్మాతగా మారడం మనం చాలామందిని చూశాం. కానీ.. నటి నిర్మాతగా మారి అదే సినిమాలో హీరోయిన్ గా నటించడం చాలా అరుదుగా జరుగుతుంది. మిత్రా శర్మ నిజానికి ముంబై మహిళా కాగా తెలుగు నటులతో సమానంగా తెలుగు మాట్లాడగలడం విశేషం. ఒకవైపు వ్యాపారంతో పాటు సినిమాల్లో నటిస్తూ ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. ఇప్పటికే నటుడు కార్తికేయ చేతుల మీదిగా పోస్టర్ విడుదల చేయించిన మిత్రా.. ఇప్పుడు సన్నీలియోన్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేయిస్తున్నారు. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి!