కార్తికేయతో సుకుమార్ సినిమా..
బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద కొత్త దర్శకులను పరిచయం చేస్తూ వినూత్నమైన సినిమాల్ని నిర్మిస్తూ సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’, ‘ఉప్పెన’ వంటి చిత్రాలు బ్లాక్బస్టర్స్గా నిలిచాయి.
Sukumar – Kartikeya: బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద కొత్త దర్శకులను పరిచయం చేస్తూ వినూత్నమైన సినిమాల్ని నిర్మిస్తూ సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’, ‘ఉప్పెన’ వంటి చిత్రాలు బ్లాక్బస్టర్స్గా నిలిచాయి.
ఈ నేపథ్యంలో మార్చి 19న విడుదల అవ్వనున్న కార్తికేయ అప్ కమింగ్ మూవీ ‘చావు కబురు చల్లగా’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ చూసి అందులో కార్తికేయ పెర్ఫార్మెన్స్కి ఇంప్రెస్ అయ్యి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో ఓ సినిమా నిర్మించడానికి సుకుమార్ ప్లాన్ చేశారు.
నవంబర్లో ప్రారంభం అవ్వనున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు సుకుమార్ అందిస్తున్నారు. నటీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు.