Buddha Venkanna: శ్రీలంకలో రాజపక్సేకు పట్టిన గతే జగన్‌కూ: బుద్ధా వెంకన్న

శ్రీలంకలో మాజీ ప్రధాని రాజపక్సేకు పట్టిన గతే, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా పట్టబోతుందని, ఈ విషయం జగన్‌కు కూడా అర్థమైందని విమర్శించారు టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న.

Buddha Venkanna: శ్రీలంకలో రాజపక్సేకు పట్టిన గతే జగన్‌కూ: బుద్ధా వెంకన్న

Buddha Venkanna

Buddha Venkanna: శ్రీలంకలో మాజీ ప్రధాని రాజపక్సేకు పట్టిన గతే, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా పట్టబోతుందని, ఈ విషయం జగన్‌కు కూడా అర్థమైందని విమర్శించారు టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న. త్వరలో జగన్‌పై ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు. సోమవారం బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ‘‘2019 నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు శని పట్టినట్లైంది. ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న జగన్‌మోహన్‌ రెడ్డి గణపవరం సభలో ఏం మాట్లాడారో, అక్కడున్న ప్రజలకు కూడా అర్థం కాలేదు. ప్రజలు ఓట్లేసి పదవినుంచి దించేసే దాకా కూడా జగన్‌ రెడ్డి ఆగలేకపోతున్నారు. చంద్రబాబు పర్యటనలకు వస్తున్న స్పందనతో జగన్‌ రెడ్డికి భయం మొదలైంది.

Bapatla : మహిళా వాలంటీర్‌ దారుణ హత్య

అందుకే చంద్రబాబు బస ఏర్పాట్లకు ఆంక్షలు పెట్టి వేధిస్తున్నారు. కర్నూలులో చంద్రబాబుకు గెస్ట్‌హౌజ్ కూడా ఇవ్వలేదు. మహానాడు నిర్వహణను ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా అడ్డుకుంటోoది. మహానాడు నిర్వహణకు అనుమతులు ఇవ్వకుండా సాగతీయటం దుర్మార్గం. జగన్ రెడ్డి తాత రాజారెడ్డి దిగొచ్చినా మహానాడుని ఆపలేరు. రేపటిలోగా మహానాడుకు పర్మిషన్ ఇవ్వకపోతే ఎల్లుండి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాము’’ అని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.