Charmi: ముగిసిన ఛార్మి విచారణ.. ఇంతకంటే ఎక్కువ అడక్కండి!

ఛార్మి మొబైల్ లో కెల్విన్ చాటింగ్ వివరాలపైనా ఈడీ అధికారులు కూపీ లాగినట్టు చెబుతున్నారు. కెల్విన్ నంబర్ ను ఛార్మి మొబైల్ లో దాదా పేరుతో ఫీడ్ చేసుకున్నట్టు సమాచారం.

Charmi:  ముగిసిన ఛార్మి విచారణ.. ఇంతకంటే ఎక్కువ అడక్కండి!

Charmi Tollywood Drugs Case

Tollywood Drug Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు- ఈడీ దర్యాప్తుకు సంబంధించి  సినిమా నటి, నిర్మాత ఛార్మి .. ఇంటరాగేషన్ పూర్తయింది. ఈడీ ఆఫీస్ లో చార్మిని దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ లింకులపై వివరాలు తెల్సుకున్నట్టు సమాచారం. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్ గా మారి ఇచ్చిన సమాచారంతో.. ఛార్మిని ప్రశ్నించారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఛార్మిని అడిగినట్టు సమాచారం అందుతోంది.

ఈడీ విచారణ తర్వాత.. మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు ఛార్మి. ఈడీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు అన్నీ సమర్పించానని చెప్పారు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈడీ విచారణకు తాను పూర్తి గా సహరించాననీ… ఎప్పుడు విచారణకు పిలిచినా కో ఆపరేట్ చేస్తానని అన్నారు. లా ప్రకారం తాను ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేనని చెప్పారు ఛార్మి.

ఛార్మి మొబైల్ లో కెల్విన్ చాటింగ్ వివరాలపైనా ఈడీ అధికారులు కూపీ లాగినట్టు చెబుతున్నారు. కెల్విన్ నంబర్ ను ఛార్మి మొబైల్ లో దాదా పేరుతో ఫీడ్ చేసుకున్నట్టు సమాచారం. ఈ అంశంపైనా ఈడీ వివరాలు తెల్సుకున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్, ఛార్మి ఫిలిం బ్యానర్ల బ్యాంక్ ఆడిట్ రిపోర్టులను పరీశీలించారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఈ కేసు విచారణ క్రమంలో తొలిరోజు పూరీ జగన్నాథ్ ను ప్రశ్నించి వివరాలు రాబట్టారు అధికారులు.