జూబ్లీక్లబ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి

  • Published By: bheemraj ,Published On : December 1, 2020 / 08:25 AM IST
జూబ్లీక్లబ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి

Chiranjeevi GHMC elections : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సినీ హీరో చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీక్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. చిరంజీవితోపాటు ఆయన సతీమణి సురేఖ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరికాసేపట్లో రామ్ చరణ్ దంపతులు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.



దీంతోపాటు మరో ప్రముఖ నటుడు కృష్ణంరాజు కూడా ఇదే పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే ప్రముఖులు జూబ్లీ క్లబ్ లోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినిగించుకుంటున్నారు. జూబ్లీక్లబ్ లోని 20, 21 పోలింగ్ కేంద్రాల పరిధిలో దాదాపు 1400 మంది ఓటర్లు ఉన్నారు.



సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నగరంలో 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 9,101 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. కరోనా దృష్ట్యా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది.



ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ప్రతిపోలింగ్ బూత్ లో శానిటైజర్ ఏర్పాటు చేశారు. కరోనా పేషెంట్ లు కూడా ఓటు హక్కు వినియోగంచుకునేలా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అయితే పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కు వినిగియోగించుకునే అవకాశం కల్పించారు.