BIG BREAKING: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు..

BIG BREAKING: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు..

Class 10th Board Exams Canceled 12th Postponed

BIG BREAKING CBSE Exams: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా కారణంగా.. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షను రద్దు చేసి 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. 12 వ తేదీ పరీక్షకు సంబంధించిన నిర్ణయం జూన్ 1 న తీసుకోనున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో.. సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వ్యాప్తి వల్ల ఎగ్జామ్స్ రద్దు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోడీని కోరగా.. కేజ్రీవాల్ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం తరువాత 12 వ తరగతి పరీక్షలను వాయిదా వేసి 10 వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

ఢీల్లీతో పాటు చాలా రాష్ట్రాలు ఈమేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థుల కోసం, బోర్డు అభివృద్ధి చేసిన ““objective criterion”” ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ప్రాతిపదికన విద్యార్ధులకు కేటాయించిన మార్కులతో సంతృప్తి చెందని అభ్యర్థికి పరీక్షలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరీక్షలో కూర్చునే అవకాశం ఇస్తారు. గతేడాది కూడా ప్రభుత్వం కొత్త పద్దతిని అనుసరించింది.