TTD: “వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణకు విచ్చేయండి”
తిరుపతి సమీపంలోని పాతకాల్వ పేరూరు బండ వద్ద నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 23వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆహ్వానించారు.
TTD: తిరుపతి సమీపంలోని పాతకాల్వ పేరూరు బండ వద్ద నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 23వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి కలిసి సీఎం జగన్కు స్వామివారి ప్రసాదాలు అందించి, శాలువతో సన్మానించారు. వేద పండితులు సీఎంకు వేద ఆశీర్వాదం అందజేశారు.
జూన్ 18వ తేదీ నుంచి శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం కాగా, జూన్ 23వ తేదీ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
Read Also: టీటీడీ చరిత్రలో తొలిసారిగా.. మే నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం