గ్రేటర్, అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు సీఎం కేసీఆర్ అనుమతి ఇస్తారా
తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మంగళవారం(జూన్ 9,2020) ప్రగతి భవన్లో సమావేశం అయ్యారు. మంత్రి
తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మంగళవారం(జూన్ 9,2020) ప్రగతి భవన్లో సమావేశం అయ్యారు. మంత్రి
తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మంగళవారం(జూన్ 9,2020) ప్రగతి భవన్లో సమావేశం అయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లాక్ డౌన్ సడలింపులతో ఆర్టీసీ బస్సుల నిర్వహణపై కేసీఆర్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ లో బస్సుల నిర్వహణపై డిస్కస్ చేస్తున్నారు. గ్రేటర్లో బస్సులు నడిపించాలా? వద్దా? అనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు. అలాగే అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ప్రభుత్వం సడలింపులివ్వడంతో హైదరాబాద్ మినహా జిల్లాల్లో ఇప్పటికే బస్సులు తిరుగుతున్న విషయం తెలిసిందే. అంతర్ రాష్ట్ర, గ్రేటర్ లో బస్సు సర్వీసులపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.