Priyanka Gandhi: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీకి కోవిడ్ పాజిటివ్
కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. తనకు కోవిడ్ సోకినట్లు ప్రియాంకా గాంధీ బుధవారం ఉదయం వెల్లడించారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు చెప్పారు.
Priyanka Gandhi: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ప్రియాంకా గాంధీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బుధవారం ఉదయం వెల్లడించారు. ఈ ఏడాదిలో ఆమెకు కరోనా సోకడం ఇది రెండోసారి. గత జూన్ నెలలో కూడా ఆమెకు కరోనా సోకింది.
Rajasthan: 70 ఏళ్ల వయసులో తల్లైన మహిళ.. పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారిన జంట
మూడు నెలలు కూడా పూర్తవకముందే ప్రియాంకకు రెండోసారి కరోనా సోకడం విశేషం. కాగా, ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు, ప్రొటోకాల్ నిబంధనలు పాటిస్తున్నట్లు ప్రియాంక వెల్లడించారు. ప్రియాంగా గాంధీకి ప్రస్తుతం స్వల్ప అనారోగ్య లక్షణాలే ఉన్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ నేత, ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన రాజస్థాన్లోని ఆల్వార్లో బుధవారం పర్యటించాల్సి ఉంది. అయితే, అనారోగ్యం కారణంగా ఈ పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ప్రియాంకా గాంధీ తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా గత జూన్ నెలలో కోవిడ్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఐదు రోజుల క్రితం ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.