congress: సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి లేఖ
రాష్ట్రంలో హోం గార్డులు, మోడల్ స్కూళ్ల సిబ్బంది ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
congress: రాష్ట్రంలో హోం గార్డులు, మోడల్ స్కూళ్ల సిబ్బంది ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హోం గార్డులు, మోడల్ స్కూళ్ల సిబ్బందికి వెంటనే జీతాలు అందించాలని ఆయన అన్నారు. తెలంగాణ ఆవిర్భావం నాడు 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రస్థానం ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి చేరుకుందని ఆయన విమర్శలు గుప్పించారు.
agnipath: తెలంగాణ పోలీసుల అదుపులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావు
టీఆర్ఎస్ పాలనలో విలువైన భూముల అమ్మేస్తున్నారని, లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారని, ప్రజలపై పలు రకాల పన్నుల భారం పడుతోందని రేవంత్ రెడ్డి చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ ఛార్జీల పెంపు, భూముల రిజిస్ట్రేషన్, బస్ ఛార్జీలు పెంచారని అన్నారు. రూ.200 కోట్లు ఖర్చు చేసి దేశ వ్యాప్తంగా పత్రికల్లో కేసీఆర్ మహానేత అయినట్టు ప్రకటనలు ఇచ్చుకున్నారని విమర్శించారు. కేసీఆర్ పుత్రరత్నం కేటీఆర్ విదేశీ పర్యటనల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆయన అన్నారు. హోం గార్డుల కుటుంబాల పరిస్థితి గురించి ఒక్కసారైనా ఆలోచించారా అని ఆయన ప్రశ్నించారు.
Maharashtra: మా ప్రభుత్వం పతనం అంచున ఉన్నా మేము పోరాడుతూనే ఉంటాం: సంజయ్ రౌత్
సకాలంలో జీతాలు ఇవ్వకుంటే వాళ్ల కుటుంబాలు ఎలా గడుస్తాయని అనుకుంటున్నారని నిలదీశారు. ఇప్పుడు మోడల్ స్కూళ్లలో టీచింగ్-నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. తొలకరి మొదలై వానాకాలం పంటకు సమయం ఆసన్నమైనా ఇంత వరకు రైతు బంధు నిధులు కూడా విడుదల చేయలేదని ఆయన విమర్శించారు. ఈ సారి రైతుబంధు ఉంటుందా? ఉంటే ఎప్పుడిస్తారు? అసలు ఇస్తారా? లేదా? అని ఆయన అన్నారు. బీఆర్ఎస్, వీఆర్ఎస్ అంటూ ప్రజలకు కనిపించకుండా కేసీఆర్ తిరుగుతున్నారని, అసలు ఆయన రాష్ట్రంలోనే ఉన్నారో లేదో తెలియకుండా కాలక్షేపం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.