తెలంగాణలో కరోనా పరీక్షలు : ధరల వివరాలు..పూర్తి వివరాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలపై సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ల్యాబ్ లకు పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షల విషయంలో పలు నిబంధనలు విధించింది. పరీక్షల విషయంలో ఎవరినీ భయపెట్టవద్దని సూచించింది. కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు నిర్ణయించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి 2020, జూన్ 15వ తేదీ సోమవారం మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తి వివరాలు
ప్యాకేజీ | రోజు వారి ఫీజులు (రూ.లలో) |
రోటిన్ వార్డు + ఐసోలేషన్ | 4,000 |
ఐసీయూ (వెంటిలెటర్ లేకుండా) + ఐసోలేషన్ | 7,500 |
ఐసీయూ (వెంటిలెటర్) + ఐసోలేషన్ | 9,000 |
ఇందులో లభించేవి : రోగికి సీబీసీ, యూరిన్ రొటీన్, హెచ్ ఐవీ స్పాట్, యాంటీ హెచ్ ఐవీ, యూఎస్ జీ, 2డీ ఎకో, drug, x ray, హెచ్ బీఎస్, సీరం క్రియటినైన్, బెడ్ చార్జెస్, భోజనంతో పాటు..(రెలెస్ట్యూబ్ ఇన్సర్షన్,యూరినరీ ట్రాక్టు, క్యాథెట రైజేషన్) సేవలు.
ప్యాకేజీలో ఇవి లభించవు : పీపీఈ కిట్లు. యాసిటిక్/ప్లైరల్ టాప్పింగ్. ఇంటర్వేన్షనల్ ప్రొసీజర్సు. (సెంట్రల్ లైన్ ఇన్సర్షన్, కీమోపోర్టు ఇన్సర్షన్, బ్రాంకోస్కొపిక్ ప్రొసిజర్, బైయాప్సీస్, వీటికి 2019 31 డిసెంబర్ నాటి ర్యాక్ రేట్ల ఆధారంగానే చార్జీ వసూలు చేయాలి.) హైఎండ్ డ్రగ్సు (ఇమ్యునోగ్లోబిన్, పేరంటల్ న్యూట్రిషన్, టోసిల్జంబ్, మెరోపెనమ్. వీటికి ఎంఆర్పీ ధరలే వసూలు చేయాలి). హై ఎండ్ ఇన్వెస్టిగేషన్సు (సీటీ స్కాన్, ఎంఆర్ఐ, పీఈటీ స్కాన్, ఇతర ల్యాబ్ పరీక్షలు). కోవిడ్ -19 టెస్టింగ్ ప్రభుత్వం నిర్దేశించి ప్రకారం.
కేటగిరీ | ఫీజు |
ల్యాబ్/హాస్పిటల్ వద్ద శాంపిల్ ఇస్తే | రూ. 2,200 |
ఇంటి వద్దకు వచ్చి శాంపిల్ సేకరిస్తే | రూ. 2,800 |
కరోనా చికిత్స కోసం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు :
రోగులు, వారి బంధువుల కు సేవల వివరాలను వెల్లడించాలి. పాజిటివ్ ఉన్నా..లక్షణాలు లేని వారు, అతి తక్కువ లక్షణాలున్న వాళ్లను ఆస్పత్రుల్లో చేర్చుకోవద్దు. హోం ఐసోలేషన్కు పరిమితం చేయాలి. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను డిస్ప్లే బోర్డుల్లో తప్పకుండా ప్రదర్శించాలి. అంతవరకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలి. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వెబ్సైట్లో కరోనా వైరస్ కు సంబంధించిన కేసులను సకాలంలో పొందుపరచాలి.
ప్రతి ల్యాబ్, ఆస్పత్రికి పరిశీలన తర్వాత యూజర్ ఐడీ, పాస్వర్డులు జారీ చేస్తారు. ఐసీఎంఆర్ అనుమతించిన ప్రైవేటు ల్యాబ్ లు, ఆస్పత్రులే కరోనా పరీక్షలు నిర్వహించాలి. నిబంధనలకు లోబడి ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లు వ్యవహరించాలి. ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు అ తిక్రమిస్తే టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చు. కరోనా చికిత్సలు, పరీక్షలపై మార్కెటింగ్ చేసుకున్నట్లు ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటారు.