IPL 2021: చెన్నై స్టేడియంలోనే నా రిటైర్మెంట్ – ఎంఎస్ ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు. ఈ ఏడాది సీజన్ తర్వాత తాను రిటైర్ అవడం లేదని పరోక్షంగా చెప్పేశాడు.

IPL 2021: చెన్నై స్టేడియంలోనే నా రిటైర్మెంట్ – ఎంఎస్ ధోనీ

Ms Dhoni

IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు. ఈ ఏడాది సీజన్ తర్వాత తాను రిటైర్ అవడం లేదని పరోక్షంగా చెప్పేశాడు. ఫేర్‌వెల్ గేమ్ జరిగేదంటూ ఉంటే అది చెన్నై స్టేడియంలోనే అని చెప్పుకొచ్చాడు. ఇండియా సిమెంట్స్ 75వ వార్షికోత్సవ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఆయన.. అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు.

ఈ సందర్భంగానే అభిమానులతో ముచ్చటించి.. తన ఫేర్ వెల్ మ్యాచ్ గురించి చెప్పాడు. ‘ఫేర్‌వెల్ విషయానికొస్తే మీరు ఇంకా వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ గేమ్ ఆడటం చూడొచ్చు. ఇంకా రిటైర్ అవ్వాలనుకుంటే అది చెన్నై స్టేడియం వేదికగానే జరుగుతుందని ఆశిస్తున్నా. అక్కడైతే అభిమానులను ఎక్కువమందిని కలిసే వీలుంటుంది’ అని ధోనీ వివరించాడు.

స్టన్నింగ్ ఇంటర్నేషనల్ కెరీర్ కు 2020 ఆగష్టు 15న వీడ్కోలు చెప్పేశాడు ధోనీ. లేటెస్ట్ స్టేట్మెంట్ ను బట్టి ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా తన ఫైనల్ గేమ్ జరుగుతుందని తెలిసింది. ధోనీ సారథ్యంలో ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత సీజన్ లో పాయింట్లలో రెండో స్థానంలో నిలిచింది.

…………………………………..: కశ్మీర్‌పై వ్యూహం మార్చిన ఉగ్రవాదులు

ఆడిన 13మ్యాచ్ లలో 9గెలవగా 4ఓడిపోయింది. టాప్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతుంది.